నవ రాత్రి అలంకారాలు తొమ్మిది రోజులు వరసగా










లక్ష్మి దేవి నివసించే ప్రదేశాలు




కాత్యాయని దేవి


శ్రీ మహాసరస్వతి

శరన్నవరాత్రులలో మూలా నక్షత్రం నాడు శ్రీ సరస్వతీ పూజ చేసుకు౦టాము. శ్రీ మహాసరస్వతి పరమశివుని సోదరి. పార్వతీ దేవి విష్ణుమూర్తి సోదరి. వేదములలో స్ఫటికమువలె స్వచ్ఛమైన పరమేశ్వరుని ఆకృతి, జటాజూటము, చ౦ద్రరేఖ, త్రినేత్రముల ప్రసక్తియున్నది. ఆభగవఒతునిజ్ఞానప్రదమగు రూపమే శ్రీదక్షిణామూర్తి. ఆ మూర్తి చేతిలోని పుస్తక ప్రసక్తి కూడా వేదములలో ఉన్నది. ఆ సదాశివుడు సమస్త విద్యలకు ఈశానుడు(ప్రభువు) అని వేదము స్తుతి౦చుచున్నది. ఈ లక్షణములన్నియు శ్రీ సరస్వతీదేవికి కూడా అన్వయిస్తాయి. పుస్తకము, స్ఫటికమాల, శ్వేతవర్ణము, జటాజూటము, చ౦ద్రరేఖ, త్రినేత్రములు, జ్ఞానప్రదానము ఇవన్నీ పరమేశ్వరునికి, సరస్వతీ దేవికి సమాన లక్షణములే. కోరికలు మనసుని క్షోభి౦పజేసి, జ్ఞానాన్ని ప్రతిబ౦ధిస్తాయి. తృతీయనేత్రము కోరికలని దహి౦చి వేసి జ్ఞాన ప్రాప్తికి సహాయమౌతు౦ది. సూర్యుడు చాలా కా౦తిమ౦తుడే గాని, ఆకా౦తి వేడి తాపాన్ని కలిగిస్తు౦ది. చ౦ద్రరేఖ వెన్నెలని దానితోపాటు ఆహ్లాదకరమైన చల్లదనాన్ని కూడా అ౦దిస్తు౦ది. చ౦ద్రకళల అభివృద్ధి జ్ఞానాభివృద్ధిని సూచిస్తు౦ది. స్ఫటికము స్వచ్ఛతని, దోషరాహిత్యాన్ని సూచిస్తు౦ది.

సరస్వతీ దేవిని ఆరాధించే విధానం ఎలాంటిది అని అంటే అన్ని ధవళ వస్తువులు ఈ తల్లికి ప్రీతికరం. జ్ఞానానికి సంకేతమే తెలుపు. అందుకు ఈ తల్లికి ఇవ్వవలసినవి – సుగంధం శుక్ల పుష్పంచ సుగంధం శుక్ల చందనం! తెల్లని చందనము, తెల్లని పువ్వులు, తెల్లని వస్త్రములు, శంఖము, ముత్యాల మాలలు, ఈ తల్లికి సమర్పించాలి పూజా సమయంలో. పైగా మరొక ప్రత్యేకత ఏమిటంటే తెల్లని చందనంలో ముంచిన తెల్లని పువ్వులతో పూజిస్తే ఒక విశేషాన్ని చెప్పారు. ఒకప్పుడు సనక సనందనాదులు బ్రహ్మ వద్దకు వచ్చి బ్రహ్మ విద్య చెప్పమని కోరుకున్నారు. వెంటనే బ్రహ్మదేవుడు ధ్యానం చేసి చెప్తా ఉండు అనేటప్పటికల్లా నోట మాట రాలేదు. ఎంతో తెలుసు అనుకున్నానే, నానోట మాట రావడం లేదు, బుద్ధికి ఏమీ తోచడం లేదు అనుకున్నాడట. ఒక్కొక్కప్పుడు ఎన్ని తెలిసున్నప్పటికీ నోరు పెగలదు, బుద్ధికి ఏమీ తోచదు. అప్పుడు ఆ సమయంలో నారాయణుడు అక్కడికి వచ్చి సరస్వతీ దేవి మంత్రాన్నిచ్చి జపం చేయమని చెప్పాడు. అప్పుడు సరస్వతీ దేవిని తలంచుకోగానే బ్రహ్మకు ఆలోచన, జ్ఞానము కలిగి బోధ చేశాడు. అందుకు మన బుద్ధికి ఒక మంచి జ్ఞానం రావాలన్నా వచ్చిన జ్ఞానం అవతలి వారికి అందించాలన్నా సరస్వతీ దేవి అనుగ్రహం కావలసిందే

చిత్రం: శరన్నవరాత్రులలో మూలా నక్షత్రం నాడు శ్రీ సరస్వతీ పూజ చేసుకు౦టాము. శ్రీ మహాసరస్వతి పరమశివుని సోదరి. పార్వతీ దేవి విష్ణుమూర్తి సోదరి. వేదములలో స్ఫటికమువలె స్వచ్ఛమైన పరమేశ్వరుని ఆకృతి, జటాజూటము, చ౦ద్రరేఖ, త్రినేత్రముల ప్రసక్తియున్నది. ఆభగవఒతుని జ్ఞానప్రదమగు రూపమే శ్రీదక్షిణామూర్తి. ఆ మూర్తి చేతిలోని పుస్తక ప్రసక్తి కూడా వేదములలో ఉన్నది. ఆ సదాశివుడు సమస్త విద్యలకు ఈశానుడు(ప్రభువు) అని వేదము స్తుతి౦చుచున్నది. ఈ లక్షణములన్నియు శ్రీ సరస్వతీదేవికి కూడా అన్వయిస్తాయి. పుస్తకము, స్ఫటికమాల, శ్వేతవర్ణము, జటాజూటము, చ౦ద్రరేఖ, త్రినేత్రములు, జ్ఞానప్రదానము ఇవన్నీ పరమేశ్వరునికి, సరస్వతీ దేవికి సమాన లక్షణములే. కోరికలు మనసుని క్షోభి౦పజేసి, జ్ఞానాన్ని ప్రతిబ౦ధిస్తాయి. తృతీయనేత్రము కోరికలని దహి౦చి వేసి జ్ఞాన ప్రాప్తికి సహాయమౌతు౦ది. సూర్యుడు చాలా కా౦తిమ౦తుడే గాని, ఆకా౦తి వేడి తాపాన్ని కలిగిస్తు౦ది. చ౦ద్రరేఖ వెన్నెలని దానితోపాటు ఆహ్లాదకరమైన చల్లదనాన్ని కూడా అ౦దిస్తు౦ది. చ౦ద్రకళల అభివృద్ధి జ్ఞానాభివృద్ధిని సూచిస్తు౦ది. స్ఫటికము స్వచ్ఛతని, దోషరాహిత్యాన్ని సూచిస్తు౦ది. 

సరస్వతీ దేవిని ఆరాధించే విధానం ఎలాంటిది అని అంటే అన్ని ధవళ వస్తువులు ఈ తల్లికి ప్రీతికరం. జ్ఞానానికి సంకేతమే తెలుపు. అందుకు ఈ తల్లికి ఇవ్వవలసినవి – సుగంధం శుక్ల పుష్పంచ సుగంధం శుక్ల చందనం! తెల్లని చందనము, తెల్లని పువ్వులు, తెల్లని వస్త్రములు, శంఖము, ముత్యాల మాలలు, ఈ తల్లికి సమర్పించాలి పూజా సమయంలో. పైగా మరొక ప్రత్యేకత ఏమిటంటే తెల్లని చందనంలో ముంచిన తెల్లని పువ్వులతో పూజిస్తే ఒక విశేషాన్ని చెప్పారు. ఒకప్పుడు సనక సనందనాదులు బ్రహ్మ వద్దకు వచ్చి బ్రహ్మ విద్య చెప్పమని కోరుకున్నారు. వెంటనే బ్రహ్మదేవుడు ధ్యానం చేసి చెప్తా ఉండు అనేటప్పటికల్లా నోట మాట రాలేదు. ఎంతో తెలుసు అనుకున్నానే, నానోట మాట రావడం లేదు, బుద్ధికి ఏమీ తోచడం లేదు అనుకున్నాడట. ఒక్కొక్కప్పుడు ఎన్ని తెలిసున్నప్పటికీ నోరు పెగలదు, బుద్ధికి ఏమీ తోచదు. అప్పుడు ఆ సమయంలో నారాయణుడు అక్కడికి వచ్చి సరస్వతీ దేవి మంత్రాన్నిచ్చి జపం చేయమని చెప్పాడు. అప్పుడు సరస్వతీ దేవిని తలంచుకోగానే బ్రహ్మకు ఆలోచన, జ్ఞానము కలిగి బోధ చేశాడు. అందుకు మన బుద్ధికి ఒక మంచి జ్ఞానం రావాలన్నా వచ్చిన జ్ఞానం అవతలి వారికి అందించాలన్నా సరస్వతీ దేవి అనుగ్రహం కావలసిందే

కాత్యాయనీ దేవి




సరస్వతి కవచమ్



శ్రీ లక్ష్మీ దేవ్యై నమో నమః!

లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీ రంగ ధామేశ్వరీం
దాసీభుత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్దవిభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం

రేపటి రోజున మనకి కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రి పై శ్రీ మహాలక్ష్మీ దేవి గా దర్శ్నము ఇస్తుంది.
కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తు , గజరాజు సేవిస్తు ఉండగా, శ్రీమన్మహాలక్ష్మి దర్శనమిస్తుంది. ఐశ్వర్య ప్రదాయిని, అష్టలక్ష్ముల రూపమే మహాలక్ష్మి దేవి!

ఈమే క్షీరాబ్ది పుత్రిక. డోలారుడు అనే రాక్షసుడిని సమ్హరించి దేవత. శక్తి త్రయం లో ఈమే మధ్య శక్తి. ఈ దేవిని ఉపాశన చేస్తే ఫలితాలు సీఘ్రంగా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.

సర్వజగత్తులకి కారణమైన పరాశక్తే లక్ష్మీ దేవి. ఈ జగత్తు అంతా ఏ శక్తి చేత రక్షింపబడుతున్నదో , ఆ శక్తే "లక్ష్మీ"!!!!!!! లక్ష్యతే మీయతే అనయా ఇతి లక్ష్మి అని అన్నారు ...లక్ష్మణాత్ లక్ష్మి"! ఈ జగత్తులో ప్రతిదానికి ఒక లక్షణం ఉంది. ఆ లక్షణాన్ని అనుసరించే సర్వవిధ ప్రవర్తనలు సంభవమవుతాయి. అలా జగత్తుకి హేతభూతమైన లక్ష్మణ శక్తి లక్ష్మీ.

భగవద్గీత లో కృష్ణ పరమాత్మ ' ఇవి నా విభుతులూ అని విభుతి యోగం లో చెప్పినవన్ని లక్ష్మీ స్వరూపలే.
ఎవరైనా సరే ముందుగా లక్ష్మీ కటాక్షాన్నే కోరుకుంటారు. అయితే తన బిడ్డల సంగతి తెల్సు కనుక , విద్యాగంధం లేని వాడు అఙ్ఞవశాన ధనాన్ని చెడుపనులకు ఉపయోగించి, పాపాలను మూటకట్టుకుంటాడు అనే ఉద్దేశంతో మొదట అతనికి సరస్వతి ప్రసన్నతను అనుగ్రహించి, ఆ తరువాత ఐశ్వర్యాన్ని చక్కగా అనుభవించగలిగే వివేకాన్ని ఇస్తుంది. అందుకే ఆ తల్లిని ఐశ్వర్య ప్రదాయిని అని అన్నారు!

సూర్య, చంద్ర , అగ్ని, వాయువు, భూమి మొదలు అయినవి అన్నీ ఐశ్వర్యాలే ...ఈ ఐశ్వర్యాలకు కారణమైన పర బ్రహ్మ శక్తి , ఐశ్వర్య రూపిణి లక్ష్మి దేవి!

త్వం మాతా సర్వలోకానాం దేవదేవో హరిః పితా
త్వయైత ద్విష్ణునా చాంబ జగద్వ్యాప్తం చరాచరం

ఓ లక్ష్మి! ఆన్ని లోకాలకు తల్లివి నీవు. దేవదేవుడు అయిన విష్ణువే తండ్రి. నీ చేత, విష్ణువు చేత ఈ జగత్తు అంతా వ్యాపించబడింది అని ఇండ్రుడు లక్ష్మీ దేవిని స్తుతించాడు.అందుకే జగదంబతత్వాన్ని గ్రహించి, హృదయం నిండుగా భావన చేస్తే, అమంగళాలకు చోటు ఉండదు. డబ్బుకు లోటు ఉండదు. చిత్తం సుద్ధమవుతుంది. సమస్త దరిద్రాలు ధ్వంసమవుతాయి...

'శ్' అంటే పరాశక్తి.....' ఈ' అంటే పరమేశ్వరుడు, 'ఋ అంటే అగ్ని బీజం. అగ్ని ఐశ్వర్యకారకుడు.పరమేశ్వర సహితమూయిన ఐశ్వర్య ప్రదాయిని లక్ష్మి అని "శ్రీ" కి నిర్వచనం.. అందుకే ఆ తల్లి తత్వాన్ని గ్రహించి అందుకు తగినట్లుగా మసులుకుంటే, ఏ సమస్యలు దరికి రావు.

శుభ్రమైన ఇంట్లో, పంటపొలాల్లో, గోపురాళ్లో, తామరపువ్వుల్లో, రత్నాలలో, అద్దం మొదలైనవాటిలల్లో లక్ష్మీ కొలవు అయ్యి ఉంటుంది.

ఆవనెయ్య తో గాని, సువర్ణ జలం తో కాని లక్ష్మీ దేవికి అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది!
యా దేవి సర్వ భూతేషి లక్ష్మి రూపేణ సంస్తితా అంటే అన్నీ జీవులలోను ఉండే లక్ష్మి స్వరూపము దుర్గా దేవి అని చండిసప్త సతి చెప్తోంది!

కాబట్టి శరన్నవరాత్రులలో శ్రీ మహా లక్ష్మి జి పూజిస్తే సర్వమాంగళ్యాలు కలుగుతాయి.

ఈ రోజున అమ్మవారికి పూర్ణాలు నివేదన చెయ్యాలి.

తెల్లని, ఎరుపు రంగు పువ్వులతో పూజించి, లక్ష్మి అష్టొత్తరం పఠించాలి.

శ్రీ లక్ష్మీ దేవ్యై నమో నమః!

లలితా అన్న మాటకు అర్ధం



స్కంద మాతా దేవి


లలితా త్రిపుర సుందరి దేవి


" మాతా శైలపుత్రీ "

వందే వాంఛిత లాభయ చంద్రార్కకృతి శేఖరాం !
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశశ్వినీం !!
పూర్ణేందునిభాం గౌరీం మూలాధారస్థితాం,
ప్రథమ దుర్గాం త్రినేత్రాం !
పీతాంబర పరిధానాం రత్నకిరీట నానాలంకారభూషితాం !!
ప్రఫుల్ల వదనాం పల్లవాధరాం కాంత కపోలామోత్తుంగ కుచాం !
కమనీయాం లావణ్యాంశ్మైర్ముఖీం క్షీణమధ్యాం నితంబనీం !!

--: నవ దుర్గా స్తోత్రం :--

హరిద్రాభంచతుర్వాదు హారిద్రవసనంవిభుమ్ |
పాశాంకుశధరం దైవంమోదకందంతమేవ చ ||

వందే వాఞ్ఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం|
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||

దధానా కరపద్మాభ్యామక్షమాలా కమండలూ |
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||

పిండజప్రవరారూఢా చందకోపాస్త్రకైర్యుతా |
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||

సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ |
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే ||

సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా |
శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ||

చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా |
కాత్యాయనీ శుభం దద్యాదేవీ దానవఘాతినీ ||

ఏకవేణీ జపాకర్ణపూర నగ్నా ఖరాస్థితా |
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ ||

వామపాదోల్లసల్లోహలతాకంటకభూషణా |
వర్ధనమూర్ధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయంకరీ ||

శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః |
మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా ||

సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి |
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||

మాతా బ్రహ్మచారిణీ ధ్యానం..

వందే వాంఛిత లాభయ చంద్రార్ధకృత శేఖరాం !
జపమాలా కమండలూధారా బ్రహ్మచారిణీ శుభాం !!
గౌరవర్ణా స్వాధిష్ఠాన స్థితా ద్వితీయ దుర్గా త్రినేత్రాం !
ధవళ పరిధ్యానా బ్రహ్మరూపా పుష్పాలంకార భూషితాం !!
పరమవదనాం పల్లవాధరాం కాంత కపోలాపీన పయోధరాం !
కమనీయ లావణ్య స్మైర్ముఖీం నిమ్ననాభినితంబనీం !!

" మాతా చంద్రఘంటా "

వందేవాంఛిత లాభయ చంద్రార్ధకృత శేఖరాం !
సింహారూఢా దశభుజాం చంద్రఘంటా యశశ్వినీం !!
కంచనాభాం మణిపురస్థితాం తృతీయ త్రినేత్రాం !
ఖడ్గ గదా త్రిశూల చాప శరం పద్మ కమండలూ మాలా వరాభీతకరాం !!
పటాంబర పరిధ్యానాం మృదుహాస్యాం నానాలంకారభూషితాం !
మంజీర హార కేయూర కింకిణి రత్నకుండల మండితాం !
ప్రఫుల్ల వదనాం బింబాధరాం కాంత కపోలాంతుంగ కుచాం
కమనీయాం లావణ్యాం క్షీణకటిం నిదంబనీం !!

" కూష్మాండ మాతా "

వందేవాంఛిత కామర్తే చంద్రార్ధకృత శేఖరాం !
సింహరూఢా అష్టభుజా కూష్మాండా యశశ్వినీం !!
భాస్వరభాను నిభాం అనాహతస్థితాం చతుర్థ దుర్గా త్రినేత్రం !
కమండలూ చాప బాణ పద్మ సుధాకలశ చక్ర గదా జపవటీ ధరాం !!
పటాంబరపరిధ్యానాం కానీయ కృదుహగస్యా నానాలంకార భూషితాం !
మంజీర హార కేయూర కింకిణీ రత్నకుండల మండితాం !!
ప్రఫుల్లవదనాం నారూ చిబుకాం కాంత కపోల్లాంతుంగ కుచాం !
కోమలాంగీ స్మేర్ముఖీం క్షీణకటి నింబనాభ నితంబనీం !!

లోకపావని శాకంబరీ

పరమశాంతి స్వరూపిణిగా చిరు మందహాసంతో, ప్రశాంతతను కలిగించే ఆ దుర్గమ్మను ఒక్కసారి దర్శించి మనం మనసారా ధ్యానిస్తే చాలు, ఎన్నో జన్మల పాపాల నుండి మనకి విముక్తి లభిస్తుంది.

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి, వేద వేదాంత వనవాసినీ అయిన శ్రీ కనకదుర్గా అవతారమునకు పూర్వం జగన్మాత శాకాంబరీ దేవిగా అవతరించిందని దేవి భాగవతం, మార్కండేయ పురాణం, దుర్గా సప్తశతి పురాణాలలో విశేషంగా చెప్పబడింది.

శాకాంబరీ అంటే వివిధ శాకములనే ( అనగా రకరకాల కూరగాయలు మరియు ఆకు కూరలు) వస్త్రాభరణాలుగా ధరించిన తల్లి అని అర్ధం.

పూర్వం భూలోకంలో వర్షాలు లేక పంటలు పండక అనావృష్టి సంభవించింది. తాగడానికి చుక్క నీరు దొరకక ప్రజలు అల్లడుతున్న సమయంలో వారి బాధలను చూడలేని మునీశ్వరులు జగన్మాతను అనేక విధాలుగా స్తుతించగా, వారి కోరిక మేరకు జగదీశ్వరీ " ఓ మునులారా..నేను అయోనిజనై అవతరించి, నూరు కన్నులతో చల్లని చూపులు ప్రసరిస్తూ..ముల్లోకాలను కాపాడుతాను. అప్పుడు ఈ చరాచర సృష్టిలోని జనులు నన్ను " శతాక్షి దేవిగా" కొల్చుకుంటారు.

ఆ విధంగా నేను " శతాక్షి దేవిగా" కీర్తించబడుతాను. ఆ తరువాత నాదేహం నుండి శాకములను పుట్టించి, ప్రజల ఆకలిని తీరిస్తూ, మరలా వర్షాలు కురిపిస్తూ జగతిని సస్యశ్యామలంగా, సుభీక్షముగా మార్చి కాపాడుతాను" అని జగదంబ అభయమిచ్చింది.

దేవి యొక్క దేహాన్ని శాకములుగా మార్చింది. కనుక ఆ తల్లి "శాకంబరీ" నామంతో కీర్తి పొందింది.

లోక కల్యాణార్ధం ఆదిశక్తిగా, అన్నాన్ని ప్రసాదించే అన్నపూర్ణగా, శాకములను ( కాయగూరలను) ప్రసాదించే జగమునేలే ఆ జగన్మాతకే చెల్లింది.

తతోహమఖిలం లోకమాత్మాదేహ సముద్భవైః
భరిష్యామి సురా శాకై రావృష్టీః ప్రాణధారకైః
శాకంబరీం స్తువన్ ధ్యాయన్ జపన్ సంపూజయన్నమన్
అక్షయ మశ్నుతే శీఘ్రమన్న పానామృతం ఫలం.

తల్లీ అంతా నీవే . అన్నింటా నీవే ఆవరించి ఉన్నవు. ప్రాణాధారం కోసం. శాకాలను సృష్టించిన మాతవు నీవే. శాకంబరీగా అవతరించి లోకాలను కాపాడావు. శాకంబరిగా నిన్ను స్తుతించి ,ధ్యానం చేసి, జపించిన భక్తుల ఇంట అక్షయం కలుగచేస్తావు. అన్నపానాదులకు స్తుతించినట్లు వేదోక్తి.

శాకంబరీగా అవతరించిన తరువాత విశ్వకల్యాణార్ధం దుర్గముడు అనే రాక్షసుణ్ణి వధించడం వలన నేను " దుర్గా దేవిగా" మహిషాసురుణ్ణి సమ్హరించాక ఆ దుర్గా దేవి కీలుడి కిచ్చిన మాట ప్రకారం మహిషాసుర మర్ధినీ స్వరూపంతో కీలద్రి మీద ఆవిర్భవించింది.

నీలమేఘ శ్యామంతో సుమనోహరంగా సర్వాంగ సుందరంగా అభయ, వరద హస్తంతో చిరుమందహాసంతో శోభిల్లుతూ పద్మంలో ఆశీనురాలై వివిధ ఫలపుష్పాదులతో పాటు, కూరగాయల సమూదాయాన్ని ధరించి అఖిల లోకాశ్చర్యమైన సౌందర్యంతో కోరిన వారికి కొంగు బంగారంగా, జీవుడికి ఆకలి, దప్పిక తీర్చే సకల సంపదలకూ మూలమైన శక్తులు ఆ చల్లని తల్లి కనుసైగల్లోనే సంచరిస్తాయని పురాణాలు ఘోషిస్తున్నాయి.

అందుకే శాకంబరీ దేవికి అంత విశిష్టత ఏర్పడింది.

Photo: లోకపావని శాకంబరీ

రేపటి రోజున విజయవాడ కనకదుర్గమ్మ మనకి అన్నపుర్ణాదేవిగా  దర్శనం ఇస్తుంది.

పరమశాంతి స్వరూపిణిగా చిరు మందహాసంతో, ప్రశాంతతను కలిగించే ఆ దుర్గమ్మను ఒక్కసారి దర్శించి మనం మనసారా ధ్యానిస్తే చాలు, ఎన్నో జన్మల పాపాల నుండి మనకి విముక్తి లభిస్తుంది.

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి, వేద వేదాంత వనవాసినీ అయిన శ్రీ కనకదుర్గా అవతారమునకు పూర్వం జగన్మాత శాకాంబరీ దేవిగా అవతరించిందని దేవి భాగవతం, మార్కండేయ పురాణం, దుర్గా సప్తశతి పురాణాలలో విశేషంగా చెప్పబడింది.

శాకాంబరీ అంటే వివిధ శాకములనే ( అనగా రకరకాల కూరగాయలు మరియు ఆకు కూరలు) వస్త్రాభరణాలుగా ధరించిన తల్లి అని అర్ధం.

పూర్వం భూలోకంలో వర్షాలు లేక పంటలు పండక అనావృష్టి సంభవించింది. తాగడానికి చుక్క నీరు దొరకక ప్రజలు అల్లడుతున్న సమయంలో వారి బాధలను చూడలేని మునీశ్వరులు జగన్మాతను అనేక విధాలుగా స్తుతించగా, వారి కోరిక మేరకు జగదీశ్వరీ " ఓ మునులారా..నేను అయోనిజనై అవతరించి, నూరు కన్నులతో  చల్లని చూపులు ప్రసరిస్తూ..ముల్లోకాలను కాపాడుతాను. అప్పుడు ఈ చరాచర సృష్టిలోని జనులు నన్ను " శతాక్షి దేవిగా" కొల్చుకుంటారు.

ఆ విధంగా నేను " శతాక్షి దేవిగా" కీర్తించబడుతాను. ఆ తరువాత నాదేహం నుండి శాకములను పుట్టించి, ప్రజల ఆకలిని తీరిస్తూ, మరలా వర్షాలు కురిపిస్తూ జగతిని సస్యశ్యామలంగా, సుభీక్షముగా మార్చి కాపాడుతాను" అని జగదంబ అభయమిచ్చింది.

దేవి యొక్క దేహాన్ని శాకములుగా మార్చింది. కనుక ఆ తల్లి "శాకంబరీ" నామంతో కీర్తి పొందింది.

లోక కల్యాణార్ధం ఆదిశక్తిగా, అన్నాన్ని ప్రసాదించే అన్నపూర్ణగా, శాకములను ( కాయగూరలను) ప్రసాదించే జగమునేలే ఆ జగన్మాతకే చెల్లింది.

తతోహమఖిలం లోకమాత్మాదేహ సముద్భవైః
భరిష్యామి సురా శాకై రావృష్టీః ప్రాణధారకైః     
శాకంబరీం స్తువన్ ధ్యాయన్ జపన్ సంపూజయన్నమన్
అక్షయ మశ్నుతే శీఘ్రమన్న పానామృతం ఫలం.

తల్లీ అంతా నీవే .  అన్నింటా నీవే  ఆవరించి ఉన్నవు. ప్రాణాధారం కోసం.  శాకాలను సృష్టించిన మాతవు నీవే. శాకంబరీగా అవతరించి లోకాలను కాపాడావు. శాకంబరిగా నిన్ను స్తుతించి ,ధ్యానం చేసి, జపించిన భక్తుల ఇంట అక్షయం కలుగచేస్తావు. అన్నపానాదులకు స్తుతించినట్లు వేదోక్తి.

శాకంబరీగా అవతరించిన తరువాత విశ్వకల్యాణార్ధం దుర్గముడు అనే రాక్షసుణ్ణి వధించడం వలన నేను " దుర్గా దేవిగా" మహిషాసురుణ్ణి సమ్హరించాక ఆ దుర్గా దేవి కీలుడి కిచ్చిన మాట ప్రకారం మహిషాసుర మర్ధినీ స్వరూపంతో కీలద్రి మీద ఆవిర్భవించింది.   

నీలమేఘ శ్యామంతో సుమనోహరంగా  సర్వాంగ సుందరంగా అభయ, వరద హస్తంతో చిరుమందహాసంతో శోభిల్లుతూ పద్మంలో ఆశీనురాలై వివిధ ఫలపుష్పాదులతో పాటు, కూరగాయల సమూదాయాన్ని ధరించి అఖిల లోకాశ్చర్యమైన సౌందర్యంతో కోరిన వారికి కొంగు బంగారంగా, జీవుడికి ఆకలి, దప్పిక తీర్చే సకల సంపదలకూ మూలమైన శక్తులు ఆ చల్లని తల్లి కనుసైగల్లోనే సంచరిస్తాయని పురాణాలు ఘోషిస్తున్నాయి.

అందుకే శాకంబరీ దేవికి అంత విశిష్టత ఏర్పడింది.

నవరాత్రి అలంకారాలు నైవేద్యాలు






మణిద్వీప వర్ణన :


మణిద్వీప వర్ణన :

మణిద్వీపం బ్రహ్మలోకానికి పైన ఉంతుంది. దీనిని సర్వలోకమని కూడా అంటారు. మణిద్వీపం కైలాసం, వైకుంఠం, గోలోకం కంటే శ్రేష్ఠంగా విరాజిలుతూంటుంది. మణిద్వీపానికి నాలుగు వైపులా అమృత సముద్రము విస్తరించి ఉంటుంది. ఆ సముద్రంలో శీతల తరంగాలు, రత్నాలతో కూడిన సైకత ప్రదేశాలు, శంఖాలు అనేక వర్ణాలు గల జలచరాలు కన్నులు పండుగ చేస్తూంటాయి. ఆప్రదేశానికి అవతల ఏడుయోజనాల వైశాల్యం గల లోహమయ ప్రాకారం ఉంటుంది. నానా శస్త్రాస్త్రాలు ధరించిన రక్షకభటులు కాపలా కాస్తుంటారు. ప్రతి ద్వారంలోను వందలాది మంది భటులు ఉంటారు. అక్కడ శ్రీఅమ్మవారి భక్తులు నివసిస్తూంటారు. అడుగడుక్కీ స్వచ్చమైన మధుర జల సరోవరాలు, ఉద్యానవనాలు ఉంటాయి. అవి దాటి వెళితే కంచుతో నిర్మించిన మహాప్రాకారం ఉంటుంది. సమస్త వృక్ష జాతులు అక్కడ ఉంటాయి. అనేక వందల సంఖ్యలలో దిగుడు బావులు, నదీ తీర ప్రదేశాలు అక్కడ కన్నుల పండువుగా ఉంటాయి. అనేక జాతులు పక్షులు, అక్కడ వృక్షాలపైన నివసిస్తూంటాయి.

ఆ ప్రాకారం దాటగా తామ్రప్రాకారం ఉంది. అది చతురస్రాకారంగా ఉంటుంది. అక్కడ పుష్పాలు బంగారు వన్నెతో భాసిల్లుతూంటాయి. పండ్లు రత్నాలవలె కన్నుల కింపుగా ఉంటూ సువాసనలు వెదజల్లుతుంటాయి. తామ్ర ప్రాకారం దాటి వెళ్ళగా సీసప్రాకారం ఉంటుంది. సీస ప్రాకారాల మధ్య భాగంలో సంతాన వాటిక ఉంది. అక్కడ అనేక రకాల ఫలవృక్షాలు ఉంటాయి. అక్కద లెక్కలేనన్ని అమర సిద్ధగణాలు ఉంటాయి. సీస ప్రాకారాన్ని దాటి పురోగమించగా ఇత్తడి ప్రాకారం ఉంటుంది. సీస, ఇత్తడి ప్రాకారాల మధ్య భాగంలో హరిచందన తరువనాలు ఉన్నాయి. ఈ ప్రదేశమంతా నవపల్లవ తరు పంక్తులతో లేలేత తీగలతో, పచ్చని పైరులతో కనులవిందుగా ఉంటుంది. అక్కడి నదీనదాలు వేగంగా ప్రవహిస్తుంటాయి. ఆ ఇత్తడి ప్రాకారం దాటగా పంచలోహమయ ప్రాకారం ఉంటుంది. ఇత్తడి పంచలోహమయ ప్రాకారాల మధ్యలో మందార వనాలు, చక్కని పుష్పాలతో నయనానందకరంగా ఉంటాయి. ఆ పంచలోహ ప్రాకారం దాటి ముందుకు వెళ్ళగా, మహోన్నత శిఖరాలతో రజత ప్రాకారం ఉంది. అక్కడ పారిజాత పుష్పాలు సుగంధాలు వెదజల్లుతుంటాయి. ఆ ప్రాకారం దాటి వెళ్ళగా సువర్ణమయ ప్రాకారం తేజరిల్లుతుంది. రజత, సువర్ణమయ ప్రాకారాల మధ్య కదంబవనం ఉంది. ఆ చెట్ల నుండి కదంబ మద్యం ధారగా ప్రవహిస్తుంటుంది. దానిని పానము చేయడం వలన ఆత్మానందం కలుగుతుంది.
సువర్ణమయ ప్రాకారాన్ని దాటి వెళ్ళగా ఎర్రటి కుంకుమ వర్ణంగల పుష్యరాగమణి ఉంటుంది. సువర్ణమయ, పుష్యరాగ ప్రాకారాల మధ్య వృక్షాలు, వనాలు, పక్షులు అన్ని రత్నమయాలై ఉంటాయి. ఇక్కడ దిక్పతులైన ఇంద్రాదులు ఆయుధాలు ధరించి ప్రకాశిస్తుంటారు. దానికి తూర్పుగా అమరావతీ నగరం నానావిధ వనాలతో భాసిల్లుతూంతుంది. అక్కడ మహేద్రుడు వజ్రహస్తుడై దేవసేనతో కూడి ఉంటాడు. దానికి ఆగ్నేయభాగంలో అగ్నిపురం ఉంటుంది. దక్షిణ భాగంలో యముని నగరం సమ్యమిని ఉంది. నైరుతీ దిశలో కృష్ణాంగన నగరంలో రాక్షసులు ఉంటారు. పశ్చిమదిశలో వరుణ దేవుడు శ్రద్ధావతి పట్టణంలో పాశధరుడై ఉంటాడు. వాయువ్యదిశలో గంధవతిలో వాయుదేవుడు నివసిస్తూంటాడు. ఉత్తరదిశలో కుబేరుడు తన యక్షసేనలతో, అలకాపురి విశేష సంపదతో తేజరిల్లుతూంటుంది. ఈశాన్యంలో మహారుద్రుడు అనేకమంది రుద్రులతోనూ, మాతలతోనూ, వీరభద్రాదులతోనూ యశోవతిలో భాసిల్లుతూంటాడు.

పుష్యరాగమణుల ప్రాకారం దాటి వెళ్లగా అరుణవర్ణంతో పద్మరాగమణి ప్రాకారం ఉంటుంది. దానికి గోపుర ద్వారాలు అసంఖ్యాక మండపాలు ఉన్నాయి. వాటి మధ్య మహావీరులున్నారు. చతుస్షష్టి కళలు ఉన్నాయి. వారికి ప్రత్యేక లోకాలు ఉన్నాయి. అనేక వందల అక్షౌహిణీ సైన్యాలు ఉన్నాయి. రధాశ్వగజ శస్త్రాదులు లెక్కకు మించి ఉన్నాయి. ఆ ప్రాకారాన్ని దాటి వెళ్ళగా గోమేధిక మణి ప్రాకారం ఉంటుంది. జపాకుసుమ సన్నిభంగా కాంతులను విరజిమ్ముతూ ఉంటుంది. అక్కడి భవనాలు గోమేధిక మణికాంతులను ప్రసరింపచేస్తూంటాయి. అక్కడ 32 శ్రీదేవీ శక్తులు ఉంటాయి. 32లోకాలు ఉన్నాయి. ఆ లోకంలో నివసించే శక్తులు పిశాచవదనాలతో ఉంటాయి. వారందరూ శ్రీఅమ్మవారి కోసం యుద్ధం చేయడానికి సన్నద్ధులై ఉంటారు. గోమేధిక ప్రాకారం దాటి వెళ్తే వజ్రాల ప్రాకారం ఉంటుంది. అక్కడ శ్రీత్రిభువనేశ్వరీదేవి దాసదాసీ జనంతో నివసిస్తూంటారు.

వజ్రాల ప్రాకారం దాటి వెళ్ళగా వైడూర్య ప్రాకారం ఉంటుంది. అక్కడ 8దిక్కులలో బ్రాహ్మీ, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ అనువారలు సప్త మాతృకలుగా ఖ్యాతి చెందారు. శ్రీ మహాలక్ష్మీదేవి అష్టమ మాతృకగా పిలువబడుతూ ఉంది.ఈ వైడూర్య ప్రాకారాన్ని దాటి వెళ్ళగా, ఇంద్రనీలమణి ప్రాకారం ఉంటుంది. అక్కడ షోడశ శక్తులు ఉంటాయి. ప్రపంచ వార్తలు తెలియచేస్తూంటాయి. ఇంకా ముందుకు వెళ్ళగా మరకత మణి ప్రాకారం తేజరిల్లుతూంటుంది. అక్కడ తూర్పుకోణంలో గాయత్రి, బ్రహ్మదేవుడు ఉంటారు. నైరుతికోణంలో మహారుద్రుడు, శ్రీగౌరి విరాజిల్లూతు ఉంతారు. వాయువ్యాగ్ని కోణంలో ధనపతి కుబేరుడు ప్రకాశిస్తూంటారు. పశ్చిమకోణంలో మన్మధుడు రతీదేవితో విలసిల్లుతూంటారు. ఈశాన్యకోణంలో విఘ్నేశ్వరుడు ఉంటారు. వీరందరు అమ్మవారిని సేవిస్తూంటారు. ఇంకా ముందుకు వెళ్ళగా పగడాల ప్రాకారం ఉంటుంది. అక్కద పంచభూతాల స్వామినులు ఉంటారు. పగడాల ప్రాకారాన్ని దాటి వెళ్ళగా నవరత్న ప్రాకారం ఉంటుంది. అక్కడ శ్రీదేవి యొక్క మహావతారాలు, పాశాంకుశేశ్వరి, భువనేశ్వరి, భైరవి, కపాలభైరవి, క్రోధభువనేశ్వరి, త్రిపుట, అశ్వారూఢ, నిత్యక్లిన్న, అన్నపూర్ణ, త్వరిత, కాళి, తార, షోడశిభైరివి, మాతంగి మొదలైన దశ మహావిద్యలు ప్రకాశిస్తూంటాయి. నవరత్న ప్రాకారం దాటి ముందుకు వెళ్తే, మహోజ్వల కాంతులను విరజిమ్ముతూ చింతామణి గృహం ఉంటుంది.

చింతామణి గృహానికి వేయి స్తంబాలు, శృంగార, ముక్తి, ఙ్ఞాన, ఏకాంత అనే నాలుగు మండపాలు ఉన్నాయి. అనేక మణి వేదికలు ఉన్నాయి. వాతావరణం సువాసనలు వెదజల్లుతూంటుంది. ఆ మండపాలు నాలుగు దిక్కులా కాష్మీరవనాలు కనులకింపుగా ఉంటాయి. మల్లె పూదోటలు, కుంద పుష్పవనాలతో ఆ ప్రాంతమంతా సువాసనలు ఉంటుంది. అక్కడ అసంఖ్యాక మృగాలు మదాన్ని స్రవింపచేస్తాయి. అక్కడగల మహాపద్మాల నుండి అమృత ప్రాయమైన మధువులను భ్రమరాలు గ్రోలుతూంటాయి. శృంగార మండపం మధ్యలో దేవతలు శ్రవణానందకర స్వరాలతో దివ్యగీతాలను ఆలపిస్తూంటారు. సభాసదులైన అమరులు మధ్య శ్రీలలితాదేవి సింహాసనుపై ఆసీనురాలై ఉంటుంది. శ్రీదేవి ముక్తి మండపంలో నుండి పరమ భక్తులకు ముక్తిని ప్రసాదిస్తుంది. ఙ్ఞాన మండపంలో నుండి ఙ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఏకాంత మండపంలో తన మంత్రిణులతో కొలువైయుంటుంది. విశ్వరక్షణను గూర్చి చర్చిస్తుంటుంది. చింతామణి గృహంలో శక్తితత్త్వాత్మికాలైన పది సోపానాలతో దివ్య ప్రభలను వెదజిల్లుతూ ఒక మంచం ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు దానికి నాలుగు కోళ్ళుగా అమరి ఉంటారు. ఆ నాలుగు కోళ్ళపై ఫలకంగా సదాశివుడు ఉంటాడు. దానిపై కోటి సూర్యప్రభలతో, కోటి చంద్ర శీతలత్వంతో వెలుగొందుతున్న కామేశ్వరునకు ఎడమవైపున శ్రీఅమ్మవారు ఆసీనులై ఉంటారు.

శ్రీలలితాదేవి ఙ్ఞానమనే అగ్నిగుండం నుండి పుట్టినది. నాలుగు బాహువులు కలిగి, అనురాగమను పాశము, క్రోధమనే అంకుశము, మనస్సే విల్లుగా, స్పర్శ, శబ్ద, రూప, రస, గంధాలను (పంచతన్మాత్రలను) బాణాలుగా కలిగి ఉంటుంది. బ్రహ్మాండమంతా తన ఎర్రని కాంతితో నింపివేసింది. సంపెంగ, అశోక, పున్నాగ మొదలగు పుష్పముల సువాసనలతో తలకట్టు కలిగినది. కురవిందమణులచే ప్రకాసించబడుతున్న కిరీటముచే అలంకరించబడినది. అమ్మవారి నుదురు అష్టమినాటి చంద్రునివలె ప్రకాశితూంటుంది. చంద్రునిలోని మచ్చవలె ఆమె ముఖముపై కస్తూరి తిలకం దిద్దుకుని ఉంటుంది. ఆమె కనుబొమ్మలు గృహమునకు అలంకరించిన మంగళ తోరణములవలె ఉన్నవి. ప్రవాహమునకు కదులుచున్న చేపలవంటి కనులు, సంపెంగ మొగ్గ వంటి అందమైన ముక్కు, నక్షత్ర కాంతిని మించిన కాంతితో మెరుస్తున్న ముక్కు పుదక, కడిమి పూల గుత్తిచే అలంకరింపబడిన మనోహరమైన చెవులకు సూర్యచంద్రులే కర్ణాభరణములుగా కలిగి ఉన్నది. పద్మరాగమణి కెంపుతో చేయబడిన అద్దము కంటె అందమైన ఎర్రని చెక్కిళ్ళతో ప్రకాశించుచున్నది. రక్త పగడమును, దొందపండును మించిన అందమైన ఎర్రని పెదవులు, షోడశీమంత్రమునందలి పదునారు బీజాక్షరముల జతవంటి తెల్లని పలువరుస కలిగియున్నది.

శ్రీమాత సేవించిన కర్పూర తాంబూల సువాసనలు నలుదిక్కులకూ వెదజల్లుతుంటాయి. ఆమె పలుకులు సరస్వతీదేవి వీణానాదమును మించి ఉంటాయి. అమ్మ చుబుకముతో పోల్చదగిన వస్తువేదీ లేదు. కామేశ్వరునిచే కట్టబడిన మంగళసూత్రముతో అమ్మ కంఠము శోభిల్లుతూంటుంది. ఆమె భుజములు బంగారు భుజకీర్తులతోనూ దండకడియములు, వంకీలతోనూ అందముగా అలంకరింపబడి ఉంటాయి. రత్నాలు పొదిగిన కంఠాభరణము ముత్యాల జాలరులు కలిగిన చింతాకు పతకము ధరించి ఉంటుంది. ఆమె నడుము సన్నగా ఉంటుంది. ఆమె కాలిగోళ్ళ కాంతి భక్తుల అఙ్ఞానాన్ని తొలగిస్తుంది. పద్మాలకంటే మృదువైన పాదాలు కలిగి ఉన్నది. సంపూర్ణమైన అరుణవర్ణంతో ప్రకాశిస్తూ శివకామేశ్వరుని ఒడిలో ఆసీనురాలై ఉంటుంది.మణిద్వీపం బ్రహ్మలోకానికి పైన ఉంతుంది. దీనిని సర్వలోకమని కూడా అంటారు. మణిద్వీపం కైలాసం, వైకుంఠం, గోలోకం కంటే శ్రేష్ఠంగా విరాజిలుతూంటుంది. మణిద్వీపానికి నాలుగు వైపులా అమృత సముద్రము విస్తరించి ఉంటుంది. ఆ సముద్రంలో శీతల తరంగాలు, రత్నాలతో కూడిన సైకత ప్రదేశాలు, శంఖాలు అనేక వర్ణాలు గల జలచరాలు కన్నులు పండుగ చేస్తూంటాయి. ఆప్రదేశానికి అవతల ఏడుయోజనాల వైశాల్యం గల లోహమయ ప్రాకారం ఉంటుంది. నానా శస్త్రాస్త్రాలు ధరించిన రక్షకభటులు కాపలా కాస్తుంటారు. ప్రతి ద్వారంలోను వందలాది మంది భటులు ఉంటారు. అక్కడ శ్రీఅమ్మవారి భక్తులు నివసిస్తూంటారు. అడుగడుక్కీ స్వచ్చమైన మధుర జల సరోవరాలు, ఉద్యానవనాలు ఉంటాయి. అవి దాటి వెళితే కంచుతో నిర్మించిన మహాప్రాకారం ఉంటుంది. సమస్త వృక్ష జాతులు అక్కడ ఉంటాయి. అనేక వందల సంఖ్యలలో దిగుడు బావులు, నదీ తీర ప్రదేశాలు అక్కడ కన్నుల పండువుగా ఉంటాయి. అనేక జాతులు పక్షులు, అక్కడ వృక్షాలపైన నివసిస్తూంటాయి.
ఆ ప్రాకారం దాటగా తామ్రప్రాకారం ఉంది. అది చతురస్రాకారంగా ఉంటుంది. అక్కడ పుష్పాలు బంగారు వన్నెతో భాసిల్లుతూంటాయి. పండ్లు రత్నాలవలె కన్నుల కింపుగా ఉంటూ సువాసనలు వెదజల్లుతుంటాయి. తామ్ర ప్రాకారం దాటి వెళ్ళగా సీసప్రాకారం ఉంటుంది. సీస ప్రాకారాల మధ్య భాగంలో సంతాన వాటిక ఉంది. అక్కడ అనేక రకాల ఫలవృక్షాలు ఉంటాయి. అక్కద లెక్కలేనన్ని అమర సిద్ధగణాలు ఉంటాయి. సీస ప్రాకారాన్ని దాటి పురోగమించగా ఇత్తడి ప్రాకారం ఉంటుంది. సీస, ఇత్తడి ప్రాకారాల మధ్య భాగంలో హరిచందన తరువనాలు ఉన్నాయి. ఈ ప్రదేశమంతా నవపల్లవ తరు పంక్తులతో లేలేత తీగలతో, పచ్చని పైరులతో కనులవిందుగా ఉంటుంది. అక్కడి నదీనదాలు వేగంగా ప్రవహిస్తుంటాయి. ఆ ఇత్తడి ప్రాకారం దాటగా పంచలోహమయ ప్రాకారం ఉంటుంది. ఇత్తడి పంచలోహమయ ప్రాకారాల మధ్యలో మందార వనాలు, చక్కని పుష్పాలతో నయనానందకరంగా ఉంటాయి. ఆ పంచలోహ ప్రాకారం దాటి ముందుకు వెళ్ళగా, మహోన్నత శిఖరాలతో రజత ప్రాకారం ఉంది. అక్కడ పారిజాత పుష్పాలు సుగంధాలు వెదజల్లుతుంటాయి. ఆ ప్రాకారం దాటి వెళ్ళగా సువర్ణమయ ప్రాకారం తేజరిల్లుతుంది. రజత, సువర్ణమయ ప్రాకారాల మధ్య కదంబవనం ఉంది. ఆ చెట్ల నుండి కదంబ మద్యం ధారగా ప్రవహిస్తుంటుంది. దానిని పానము చేయడం వలన ఆత్మానందం కలుగుతుంది.
సువర్ణమయ ప్రాకారాన్ని దాటి వెళ్ళగా ఎర్రటి కుంకుమ వర్ణంగల పుష్యరాగమణి ఉంటుంది. సువర్ణమయ, పుష్యరాగ ప్రాకారాల మధ్య వృక్షాలు, వనాలు, పక్షులు అన్ని రత్నమయాలై ఉంటాయి. ఇక్కడ దిక్పతులైన ఇంద్రాదులు ఆయుధాలు ధరించి ప్రకాశిస్తుంటారు. దానికి తూర్పుగా అమరావతీ నగరం నానావిధ వనాలతో భాసిల్లుతూంతుంది. అక్కడ మహేద్రుడు వజ్రహస్తుడై దేవసేనతో కూడి ఉంటాడు. దానికి ఆగ్నేయభాగంలో అగ్నిపురం ఉంటుంది. దక్షిణ భాగంలో యముని నగరం సమ్యమిని ఉంది. నైరుతీ దిశలో కృష్ణాంగన నగరంలో రాక్షసులు ఉంటారు. పశ్చిమదిశలో వరుణ దేవుడు శ్రద్ధావతి పట్టణంలో పాశధరుడై ఉంటాడు. వాయువ్యదిశలో గంధవతిలో వాయుదేవుడు నివసిస్తూంటాడు. ఉత్తరదిశలో కుబేరుడు తన యక్షసేనలతో, అలకాపురి విశేష సంపదతో తేజరిల్లుతూంటుంది. ఈశాన్యంలో మహారుద్రుడు అనేకమంది రుద్రులతోనూ, మాతలతోనూ, వీరభద్రాదులతోనూ యశోవతిలో భాసిల్లుతూంటాడు.
పుష్యరాగమణుల ప్రాకారం దాటి వెళ్లగా అరుణవర్ణంతో పద్మరాగమణి ప్రాకారం ఉంటుంది. దానికి గోపుర ద్వారాలు అసంఖ్యాక మండపాలు ఉన్నాయి. వాటి మధ్య మహావీరులున్నారు. చతుస్షష్టి కళలు ఉన్నాయి. వారికి ప్రత్యేక లోకాలు ఉన్నాయి. అనేక వందల అక్షౌహిణీ సైన్యాలు ఉన్నాయి. రధాశ్వగజ శస్త్రాదులు లెక్కకు మించి ఉన్నాయి. ఆ ప్రాకారాన్ని దాటి వెళ్ళగా గోమేధిక మణి ప్రాకారం ఉంటుంది. జపాకుసుమ సన్నిభంగా కాంతులను విరజిమ్ముతూ ఉంటుంది. అక్కడి భవనాలు గోమేధిక మణికాంతులను ప్రసరింపచేస్తూంటాయి. అక్కడ 32 శ్రీదేవీ శక్తులు ఉంటాయి. 32లోకాలు ఉన్నాయి. ఆ లోకంలో నివసించే శక్తులు పిశాచవదనాలతో ఉంటాయి. వారందరూ శ్రీఅమ్మవారి కోసం యుద్ధం చేయడానికి సన్నద్ధులై ఉంటారు. గోమేధిక ప్రాకారం దాటి వెళ్తే వజ్రాల ప్రాకారం ఉంటుంది. అక్కడ శ్రీత్రిభువనేశ్వరీదేవి దాసదాసీ జనంతో నివసిస్తూంటారు.
వజ్రాల ప్రాకారం దాటి వెళ్ళగా వైడూర్య ప్రాకారం ఉంటుంది. అక్కడ 8దిక్కులలో బ్రాహ్మీ, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ అనువారలు సప్త మాతృకలుగా ఖ్యాతి చెందారు. శ్రీ మహాలక్ష్మీదేవి అష్టమ మాతృకగా పిలువబడుతూ ఉంది.ఈ వైడూర్య ప్రాకారాన్ని దాటి వెళ్ళగా, ఇంద్రనీలమణి ప్రాకారం ఉంటుంది. అక్కడ షోడశ శక్తులు ఉంటాయి. ప్రపంచ వార్తలు తెలియచేస్తూంటాయి. ఇంకా ముందుకు వెళ్ళగా మరకత మణి ప్రాకారం తేజరిల్లుతూంటుంది. అక్కడ తూర్పుకోణంలో గాయత్రి, బ్రహ్మదేవుడు ఉంటారు. నైరుతికోణంలో మహారుద్రుడు, శ్రీగౌరి విరాజిల్లూతు ఉంతారు. వాయువ్యాగ్ని కోణంలో ధనపతి కుబేరుడు ప్రకాశిస్తూంటారు. పశ్చిమకోణంలో మన్మధుడు రతీదేవితో విలసిల్లుతూంటారు. ఈశాన్యకోణంలో విఘ్నేశ్వరుడు ఉంటారు. వీరందరు అమ్మవారిని సేవిస్తూంటారు. ఇంకా ముందుకు వెళ్ళగా పగడాల ప్రాకారం ఉంటుంది. అక్కద పంచభూతాల స్వామినులు ఉంటారు. పగడాల ప్రాకారాన్ని దాటి వెళ్ళగా నవరత్న ప్రాకారం ఉంటుంది. అక్కడ శ్రీదేవి యొక్క మహావతారాలు, పాశాంకుశేశ్వరి, భువనేశ్వరి, భైరవి, కపాలభైరవి, క్రోధభువనేశ్వరి, త్రిపుట, అశ్వారూఢ, నిత్యక్లిన్న, అన్నపూర్ణ, త్వరిత, కాళి, తార, షోడశిభైరివి, మాతంగి మొదలైన దశ మహావిద్యలు ప్రకాశిస్తూంటాయి. నవరత్న ప్రాకారం దాటి ముందుకు వెళ్తే, మహోజ్వల కాంతులను విరజిమ్ముతూ చింతామణి గృహం ఉంటుంది.
చింతామణి గృహానికి వేయి స్తంబాలు, శృంగార, ముక్తి, ఙ్ఞాన, ఏకాంత అనే నాలుగు మండపాలు ఉన్నాయి. అనేక మణి వేదికలు ఉన్నాయి. వాతావరణం సువాసనలు వెదజల్లుతూంటుంది. ఆ మండపాలు నాలుగు దిక్కులా కాష్మీరవనాలు కనులకింపుగా ఉంటాయి. మల్లె పూదోటలు, కుంద పుష్పవనాలతో ఆ ప్రాంతమంతా సువాసనలు ఉంటుంది. అక్కడ అసంఖ్యాక మృగాలు మదాన్ని స్రవింపచేస్తాయి. అక్కడగల మహాపద్మాల నుండి అమృత ప్రాయమైన మధువులను భ్రమరాలు గ్రోలుతూంటాయి. శృంగార మండపం మధ్యలో దేవతలు శ్రవణానందకర స్వరాలతో దివ్యగీతాలను ఆలపిస్తూంటారు. సభాసదులైన అమరులు మధ్య శ్రీలలితాదేవి సింహాసనుపై ఆసీనురాలై ఉంటుంది. శ్రీదేవి ముక్తి మండపంలో నుండి పరమ భక్తులకు ముక్తిని ప్రసాదిస్తుంది. ఙ్ఞాన మండపంలో నుండి ఙ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఏకాంత మండపంలో తన మంత్రిణులతో కొలువైయుంటుంది. విశ్వరక్షణను గూర్చి చర్చిస్తుంటుంది. చింతామణి గృహంలో శక్తితత్త్వాత్మికాలైన పది సోపానాలతో దివ్య ప్రభలను వెదజిల్లుతూ ఒక మంచం ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు దానికి నాలుగు కోళ్ళుగా అమరి ఉంటారు. ఆ నాలుగు కోళ్ళపై ఫలకంగా సదాశివుడు ఉంటాడు. దానిపై కోటి సూర్యప్రభలతో, కోటి చంద్ర శీతలత్వంతో వెలుగొందుతున్న కామేశ్వరునకు ఎడమవైపున శ్రీఅమ్మవారు ఆసీనులై ఉంటారు.
శ్రీలలితాదేవి ఙ్ఞానమనే అగ్నిగుండం నుండి పుట్టినది. నాలుగు బాహువులు కలిగి, అనురాగమను పాశము, క్రోధమనే అంకుశము, మనస్సే విల్లుగా, స్పర్శ, శబ్ద, రూప, రస, గంధాలను (పంచతన్మాత్రలను) బాణాలుగా కలిగి ఉంటుంది. బ్రహ్మాండమంతా తన ఎర్రని కాంతితో నింపివేసింది. సంపెంగ, అశోక, పున్నాగ మొదలగు పుష్పముల సువాసనలతో తలకట్టు కలిగినది. కురవిందమణులచే ప్రకాసించబడుతున్న కిరీటముచే అలంకరించబడినది. అమ్మవారి నుదురు అష్టమినాటి చంద్రునివలె ప్రకాశితూంటుంది. చంద్రునిలోని మచ్చవలె ఆమె ముఖముపై కస్తూరి తిలకం దిద్దుకుని ఉంటుంది. ఆమె కనుబొమ్మలు గృహమునకు అలంకరించిన మంగళ తోరణములవలె ఉన్నవి. ప్రవాహమునకు కదులుచున్న చేపలవంటి కనులు, సంపెంగ మొగ్గ వంటి అందమైన ముక్కు, నక్షత్ర కాంతిని మించిన కాంతితో మెరుస్తున్న ముక్కు పుదక, కడిమి పూల గుత్తిచే అలంకరింపబడిన మనోహరమైన చెవులకు సూర్యచంద్రులే కర్ణాభరణములుగా కలిగి ఉన్నది. పద్మరాగమణి కెంపుతో చేయబడిన అద్దము కంటె అందమైన ఎర్రని చెక్కిళ్ళతో ప్రకాశించుచున్నది. రక్త పగడమును, దొందపండును మించిన అందమైన ఎర్రని పెదవులు, షోడశీమంత్రమునందలి పదునారు బీజాక్షరముల జతవంటి తెల్లని పలువరుస కలిగియున్నది.
శ్రీమాత సేవించిన కర్పూర తాంబూల సువాసనలు నలుదిక్కులకూ వెదజల్లుతుంటాయి. ఆమె పలుకులు సరస్వతీదేవి వీణానాదమును మించి ఉంటాయి. అమ్మ చుబుకముతో పోల్చదగిన వస్తువేదీ లేదు. కామేశ్వరునిచే కట్టబడిన మంగళసూత్రముతో అమ్మ కంఠము శోభిల్లుతూంటుంది. ఆమె భుజములు బంగారు భుజకీర్తులతోనూ దండకడియములు, వంకీలతోనూ అందముగా అలంకరింపబడి ఉంటాయి. రత్నాలు పొదిగిన కంఠాభరణము ముత్యాల జాలరులు కలిగిన చింతాకు పతకము ధరించి ఉంటుంది. ఆమె నడుము సన్నగా ఉంటుంది. ఆమె కాలిగోళ్ళ కాంతి భక్తుల అఙ్ఞానాన్ని తొలగిస్తుంది. పద్మాలకంటే మృదువైన పాదాలు కలిగి ఉన్నది. సంపూర్ణమైన అరుణవర్ణంతో ప్రకాశిస్తూ శివకామేశ్వరుని ఒడిలో ఆసీనురాలై ఉంటుంది.

వ్యాసుని తపస్సు - శివుని ప్రత్యక్షం-శ్రీ దేవీ భాగవతం

శౌనకాది మహర్షులు తిరిగి ఇలా ప్రశ్నించారు.

"సూతమహర్షీ! మేరు పర్వత శిఖరానికి తపోనిమిత్తం వెళ్లిన వ్యాస భగవానుని గురించి తెల్పుతూ, మధ్య - మధ్య ప్రసక్తాను ప్రసక్తంగా వచ్చే ఉపాఖ్యానాలనూ రసవత్తరంగా వినిపిస్తున్నందుకు మాకు మహదానందంగా ఉంది. తిరిగి ముఖ్యకథా భాగమయిన వ్యాస తపోదీక్షావృత్తంతాన్ని వినిపించు" అని కోరారు.

రోమ హర్షణుడు ఈ ప్రకారం చెప్పసాగాడు.

"దేవతలకు క్రీడారంగం, మునులకు తపోవన భూమి అనదగిన మేరు పర్వత శిఖరంపై అత్యద్భుతావహమైన - సుందర సుమనోహర దృశ్యాలకు నెలవైన ఒక వనం ఉంది. అది అశ్వినులు, రుద్ర గణాలు, ఆదిత్యులు, మరుత్తులు, బ్రహ్మవాదులగు ముని పుంగవులకు నెలవు - నారద ఉపదేశానుసారం, పుత్రకామియైన వ్యాసమహర్హి మహా మాయా స్వరూపిణి అయిన పరశక్తి వాగ్బీజం అయిన ఏకాక్షరీ మంత్రజపం సాధనంగా చేసుకొని, నూరు సంవత్సరాల కాలం మహాదేవుని గురించి ఘోరమైన తపమాచరించాడు. ఆ తపోనిధి శరీరం శుహ్కించింది. తపోవేడిమికి లోకాలే తల్లడిల్లాయి. "మహాదేవా! వ్యాసమౌని తపస్సుకు లోకాలు ప్రకంపిస్తున్న కారణంగా నిన్ను రక్షణనర్థిస్తున్నాము. పాహిమాం !" అంటూ దేవతలను వెంటనిడుకొని దేవరాజు ఇంద్రుడు గౌరీపతిని వేడాడు.

శంకరుడా శచీపతిని భయము వలదని చెప్పి, "సురేంద్రా! ఎవరు ఘోర తపస్సు చేసినా, వారు నీ పదవికి ఎసరు పెడతారేమోనని భీతి చెందడం నీకు అలవాటే! కాని ఈ తాపస శ్రేష్ఠునికి నీ పదవిపై ఇసుమంతైనా ఆశలేదు. సంతానార్థియై ఆ మహర్షి సత్తముడు చేసే తపస్సునకు ప్రతిగా నేడే అతని మనోరధమీడేర్చనున్నాడు" అంటూ ఇంద్రుని వీడ్కోలిపి, వ్యాసునికి ప్రత్యక్షమయ్యాడు శివుడు. ఇష్టకామ్య సిద్ధిగా - ' సర్వులకు పూజ్యుడు, సత్త్వసంపన్నుడు, సత్యశీలుడు, జ్ఞాని, కీర్తిమంతుడు, గుణ ప్రపూర్ణుడు అయిన పుత్రుని బడయగలవు" అని ప్రసన్న వదనుడై వరమిచ్చాడు కైలాసపతి. వ్యాసుడు శివునికి నమసుమాంజలించి, ఘటించి నిజాశ్రమానికి చేరుకున్నాడు.

దేవ వేశ్య ఘృతాచి తారసపడుట :

వ్యాసమౌని ఆశ్రమమున కొంత విశ్రాంతి తీసికొని, అగ్నికార్యం నిమిత్తం అరణిని మధించసాగాడు. అరణి స్థానంలో ఒక కులకాంతను ఊహిస్తూ "స్త్రీ పురుషుల సంయోగం లేనిదే పుత్ర సంతానం ఏరీతి ప్రాప్తించగలదు? ఈ అరణిని మధించినట్లే, దండముతో ఉత్తమకుల సంజాత, రూపయవ్వన సంపన్న పతివ్రత అయిన స్త్రీని కూడి సుఖించాలి కదా! కానీ, కన్యను వరించడం - భార్యగా తెచ్చుకోవడం అంటే...నాకు నేనే కోరి బంధాల్లో చిక్కుకోవడం కాగలదు. గార్హస్థ్య జీవితం లేకుండా సంతాన ప్రాప్తి సంభవమా? ప్రణవ స్వరూపుడైన పరమేశునికే ప్రణయిని పార్వతిని కూడక తప్పని స్థితి. మరి నాకు ఏది సాధనం ?" అని తీవ్రంగా ఆలోచించసాగాడు.

సరిగ్గా అదే సమయంలో...

ఆకాశామార్గాన సంచరిస్తూ దివ్యకామిని అచ్చరలేమ ఘృతాచి వ్యాసునికి తారసిల్లింది. ఆ దేవవేశ్య మన్మధరూపం, తనువిలాసం ఎంతటి జితేంద్రియులనైనా ఆరడి బెట్టగలవనడానికి సందేహించనక్కరలేదు. అమరులకు అందుబాటులో ఉండేవేశ్య..."ఈమె నన్ను ధర్మబద్ధమైన కామానికి రా - రమ్మని ఆహ్వానించిన, నేను అంగీకరించడం ఎంతవరకు సమంజసం? సుఖ సంభోగ నిమిత్తం భ్రాంతుడినై, ఈ తేజవ్వని వెంట నేను పడితే - మునిలోకపు అవహేళనకు నేను గురికావలసి వస్తుంది. అదీగాక - నవమాసాలు మోసి పుత్రుని కని ఇచ్చునా? ఇంతా జేసి వేశ్యసంతానమా? పుత్రప్రాప్తి స్థితి వరకూ ఆమెని తీసుకెళ్లగల్గినా కీర్తిహాని తథ్యం! కనుకనే గణిత, అగణిత రతి సౌఖ్యమిచ్చినా, అట్టి కామం సకామం కానేరదు. దూష్యమే కాగలదు" ఇదీ ఘృతాచిని చూసిన తక్షణం వ్యాసుని మదిలో చెలరేగిన భావపరంపర.

అంతలోనే వ్యాసునికి ఊర్వశీ - పురూరవుల గాథ జ్ఞప్తికొచ్చి "అంతటి మహారాజు పురూరవునికే, దేవవేశ్య ఊర్వశి వల్ల పరాభవం తటస్థించింది. వేశ్యాలంపటం ఒక ఆరని చిచ్చు కదా! నారదుని వల్ల ఈ గాథ లెస్సగా విన్న నాకు దేవవేశ్యల పొందు విముఖత కల్గించాలి గాని, గుణపాఠం నేర్వకపోగా, పైగా గోతిలో పడటం విజ్ఞత కాదు కదా" అని వేశ్యాగమనాభిలాషను అణచుకున్నాడు.

"పౌరాణికగాథలను నీ వాగమృతంతో మరింత మధుర సంధాయకంగా మార్చగల వచో నిపుణ శ్రేష్ఠా ! సూత మహర్షీ! పురూరవుడెవరు? దేవవేశ్య ఊర్వశితో అతనికి పొత్తు ఎలా సంభవం ? సావధానంగా వినిపించ గోరుతున్నాం" అని శౌనకాదులు ప్రశ్నీంచగా, వ్యాస మహామహుని గాథను అక్కడికి ఆపి, పురూరవ చరితాన్ని అందుకున్నాడు సూత పౌరాణికుడు.

చంద్రఘంటా దేవి

చంద్రఘంటా  దేవి 

కుష్మండా దేవి



కుష్మండా  దేవి 

బుధ జననం-శ్రీ దేవీ భాగవతం

"దేవతల గురువైన బృహస్పతి భార్య తార. చంద్రుడు ఒక పరి యజ్ఞం చేస్తూండగా, చూడడానికి అక్కడికెళ్లింది. మన్మధబాణ ఘాతాలు సూటిగా ఆమె ఎదను తాకి, చంద్రునిపై అపారమోహాన్ని కలిగించాయమెకు. అదేరీతిలో చంద్రునికీ తారపట్ల ప్రగాఢనురక్తి కలిగింది. కలువరేడు తన జతగాడని; ఇతరులెవ్వరూ అతని సాటి రారని ఒకే ఒక్క అభిప్రాయం ఏర్పడిపోయింది తారకు.

తారా చంద్రులు ఒండొరుల వీక్షణాలు క్షణకాలం కలుసుకుని, వారి మనసులలో ప్రేమ భావన అంకురించి స్థిరపడిపోయింది. చూపులు కలిసిన ఆ శుభవేళ ఎంతటి మహత్త్వపూర్ణమైనదో, తదుపరి వారు ఏకమయ్యాకగాని వారికి తెలియలేదు. తెలిసిన తర్వాత వారెన్నడూ ఒకర్నొకరు విడిచి ఉండలేదు.

ఆ ప్రణయజీవుల ప్రేమ వ్యవహారం ముదిరి పాకాన పడిందని, దేవగురువుకు తెలిసే సరికే చాలా కాలాతీతమైంది. చంద్రునికే తన సర్వస్వం అర్పించిన తార, అతడ్నే తన నిరంతర లగ్నమానస దైవంగా ఎంచి, బృహస్పతి పట్ల వైముఖ్యం ప్రదర్శించేసరికి ఇక రాయబారాలతో తార తన దారికి రాదని ఆయనకు అర్థమైపోయింది.

చివరికి అంతటి గురుదేవుడు, శశాంకుని గృహానికి వెళ్లి - "ఓరీ చంద్రా! శిష్యాధమా! దేవతలలో ఒకడివైనందున నిన్ను శిష్యుడిగా చెప్పుకోవలసివచ్చిందిగాని, నీవంటి నీచుడికి గురువుగా ఉండదగను. గురుపత్ని అని కూడ చూడక, నాభార్య పొందు ఆశించిన నీవు పంచమహాపాతకుడవు. పైగా యజ్ఞదీక్షపూని అందుకు విరుద్ధమైన అకార్యకరణానికి వొడిగట్టావు సరే! జరిగిందేదో జరిగింది. ఇప్పటికైనా నా భార్యను విడిచిపెట్టు" అని క్రోధావేశంతో పలికాడు.

అందుకు సమాధానంగా క్షత్రియుడైన చంద్రుడు "గురువుగారూ! తాము విప్రులు, కోపం వల్ల విప్రులు పూజ్యార్హత కోల్పోతారు. తార తనకిచ్చ వచ్చినరీతిన చరించగలదు. తక్షణం ఆమె తమ ఇంట అడుగిడకపోతేనేం? ఏదో నాటికి అక్కడుండవలసిందే!" అని రాజసంగా పలికేసరికి, ఏం చెయ్యడానికీ తోచక బృహస్పతి వెనుదిరిగాడు.

చంద్రుని పరుష ప్రేలాపనలు, శచీపతి దగ్గర చెప్పుకుని బాధపడ్డాడు. తన భార్య చంద్రునికి ప్రియురాలైపోయిన వైనం వివరించి దేవగురువు బృహస్పతి పడే బాధ చూసిన ఇంద్రునికి కూడ ఒళ్ళు మండి, చంద్రుని వద్దకు ఒక దూతను రాయబారం పంపించాడు. దౌత్యం విఫలమై దేవతలకు, చంద్రునికి యుద్ధం సంఘటిల్లింది. ఒక స్త్రీ కారణంగా దేవతల్లోనే చీలిక లొచ్చి యుద్ధం ప్రారంభమైపోయింది.

ఇద్దరు సోదరులు జగడమాడుకున్నా, అందులో అవినీతిపరుడు ఎటువైపుంటాడో అటువైపు దుష్టులు చేరి సహాయం చేస్తారన్న లోకరీతి చంద్రుని పట్ల నిజమైంది. దేవగురువు పట్ల తనకున్న ద్వేషాన్ని పురస్కరించుకుని రాక్షసగురువు శుక్రాచార్యుడు చంద్రుని దగ్గరకెళ్ళి, తన మద్దతు ప్రకటించాడు. యుద్ధంలో మంత్రశక్తి ఉపయోగించి అయిన సరే - 'నీ ఎదుటిపక్షంతో పోరు సల్పడానికి నేను బాసటగా ఉంటానన్నాడు రాక్షసగురువు. అది శివునకు ఆగ్రహం తెప్పించింది.

దేవతల మధ్య రాజుకున్న అగ్ని దేవదానవ సంగ్రామంగా పరిణమించింది. సంవత్సరాల తరబడి కొనసాగింది.

బ్రహ్మదేవుడికి ఈ పరిస్థితి గొప్ప సంకట స్థితి అయింది. ఇరుపక్షాల్లోను శాంతి నెలకొల్పడం అనివార్యమైంది. హంసవానారూఢుడై ఆకాశ మార్గాన పోరు జరుగుతున్న చోటుకు వచ్చి నిలిచాడు.

"పొరపాటు చేసి, పైగా కుట్రదారులను పోగేసి పితూరీలేవదీస్తావా చంద్రా! ఇది చాలా అన్యాయం. గురుపత్నిని ఆయనకు అప్పగించు! శుక్రాచార్యా! అందరికీ బుద్ధి చెప్పవలసినవాడివి. నువ్వే ఇలా ప్రవర్తించడం తగునా? మీ సంగ్రామం వల్ల జగత్తుకు విపత్తు ఏర్పడుతున్నదన్న కనీస జ్ఞానంతోనైనా, ఈ పోరు విరమించాల్సిందే! చంద్రా! నీ తండ్రి అత్రి మాటపై నీకేమాత్రం గౌరవం ఉన్నా, తారను ఆచార్యుల వారి సన్నిధికి చేర్చు! ఆయన అభిప్రాయం నాకు చేరింది. కనుకనే హుటాహుటిగా ఇక్కడికొచ్చాను" అని గద్దించి, "శుక్రాచార్యా! అగ్నికి ఆజ్యంపోసినట్లు యుద్ధానికి బాసటగా నిల్చావు, ఇప్పుడీ శాంతికీ నీ చేతనైనది చెయ్యి" అని పెద్దరికం ఉట్టి పడేళా చెప్పాడు పితామహుడు.

పరమేష్ఠి గద్దింపు ధోరణిలో సత్యం ఉందన్న సంగతి తెలుసు కనుక, చంద్రుడి దగ్గరకెళ్లి - బృహస్పతికి తారను అప్పగించేయమన్నాడు. కాని అప్పటికే తార గర్భవతిగా ఉంది. అదే స్థితిలో ఆమెను గురువుగారికి అప్పగించేశాడు చంద్రుడు. బృహస్పతి తారను చేకొని తననివాసానికి వెళ్లాడు.

బుధ జననం:

యుద్ధం ముగిసింది. అందరూ ఎక్కడి వాళ్లక్కడ సర్దుకున్నారు. నవమాసాలూ మోసి, తార పండంటి బిడ్డడ్ని కన్నది. బృహస్పతి ఆ పిల్లవానికి యధావిధిగా జాతకర్మలు జరిపించాడు.

పుత్రుడు జన్మించాడని తెలిసిన చంద్రుడు సంబరపడి, ఆ వెంటనే - జాతకర్మలు బృహస్పతి జరిపించడం పట్ల మండిపడ్డాడు. శాస్త్రరీత్యా ఆ శిశువునకు తాను జనకుడు గనుక, తానే చేయాల్సుంటుందన్నాడు". కాదు - కాదు, ఆ శిశువు నా కొడుకే" అంటాడు బృహస్పతి.

వివాదం ముదిరింది. మళ్లీ పెద్ద రగడ అయ్యే సూచనలు కనపడేసరికి, ముందుగానే దాన్ని వారించదలచి బ్రహ్మ మరోసారి పెద్దరికం వహించాల్సి వచ్చింది. "ఏ శిశువుకు ఎవరు తండ్రి అనేది నిర్ణయించగలది, సృష్టిలో ఒక్క తల్లి మాత్రమే! బిడ్డ పుట్టాక - అదుగో నాయనా! ఆయన మీ పితృదేవుడు అంటు తల్లి వ్రేలెత్తి ఎవర్ని చూపిస్తే ఆ బిడ్డ అతన్నే తండ్రిగా పిలవడం అనాదిగా లోకరీతి. కనుక - ఈ వివాదం తగదు. తారను రప్పించి అడిగితేసరి!" అన్నాడు బ్రహ్మ. అప్పుడా దేవతల సమక్షంలో కొచ్చిన తార, అతడు ముమ్మాటికీ చంద్రవంశాంకురమేనని వచించేసరికి బృహస్పతి ఆశ్చర్యపోయాడు.

మహదానందంగా చంద్రుడా బాలుని వెంటనిడుకుని, తన నిజ నివాసానికి వెళ్లి 'బుధుడు' అని నామకరణం జరిపించాడు.
Photo: బుధ జననం-శ్రీ దేవీ భాగవతం

"దేవతల గురువైన బృహస్పతి భార్య తార. చంద్రుడు ఒక పరి యజ్ఞం చేస్తూండగా, చూడడానికి అక్కడికెళ్లింది. మన్మధబాణ ఘాతాలు సూటిగా ఆమె ఎదను తాకి, చంద్రునిపై అపారమోహాన్ని కలిగించాయమెకు. అదేరీతిలో చంద్రునికీ తారపట్ల ప్రగాఢనురక్తి కలిగింది. కలువరేడు తన జతగాడని; ఇతరులెవ్వరూ అతని సాటి రారని ఒకే ఒక్క అభిప్రాయం ఏర్పడిపోయింది తారకు.

తారా చంద్రులు ఒండొరుల వీక్షణాలు క్షణకాలం కలుసుకుని, వారి మనసులలో ప్రేమ భావన అంకురించి స్థిరపడిపోయింది. చూపులు కలిసిన ఆ శుభవేళ ఎంతటి మహత్త్వపూర్ణమైనదో, తదుపరి వారు ఏకమయ్యాకగాని వారికి తెలియలేదు. తెలిసిన తర్వాత వారెన్నడూ ఒకర్నొకరు విడిచి ఉండలేదు.

ఆ ప్రణయజీవుల ప్రేమ వ్యవహారం ముదిరి పాకాన పడిందని, దేవగురువుకు తెలిసే సరికే చాలా కాలాతీతమైంది. చంద్రునికే తన సర్వస్వం అర్పించిన తార, అతడ్నే తన నిరంతర లగ్నమానస దైవంగా ఎంచి, బృహస్పతి పట్ల వైముఖ్యం ప్రదర్శించేసరికి ఇక రాయబారాలతో తార తన దారికి రాదని ఆయనకు అర్థమైపోయింది.

చివరికి అంతటి గురుదేవుడు, శశాంకుని గృహానికి వెళ్లి - "ఓరీ చంద్రా! శిష్యాధమా! దేవతలలో ఒకడివైనందున నిన్ను శిష్యుడిగా చెప్పుకోవలసివచ్చిందిగాని, నీవంటి నీచుడికి గురువుగా ఉండదగను. గురుపత్ని అని కూడ చూడక, నాభార్య పొందు ఆశించిన నీవు పంచమహాపాతకుడవు. పైగా యజ్ఞదీక్షపూని అందుకు విరుద్ధమైన అకార్యకరణానికి వొడిగట్టావు సరే! జరిగిందేదో జరిగింది. ఇప్పటికైనా నా భార్యను విడిచిపెట్టు" అని క్రోధావేశంతో పలికాడు.

అందుకు సమాధానంగా క్షత్రియుడైన చంద్రుడు "గురువుగారూ! తాము విప్రులు, కోపం వల్ల విప్రులు పూజ్యార్హత కోల్పోతారు. తార తనకిచ్చ వచ్చినరీతిన చరించగలదు. తక్షణం ఆమె తమ ఇంట అడుగిడకపోతేనేం? ఏదో నాటికి అక్కడుండవలసిందే!" అని రాజసంగా పలికేసరికి, ఏం చెయ్యడానికీ తోచక బృహస్పతి వెనుదిరిగాడు.

చంద్రుని పరుష ప్రేలాపనలు, శచీపతి దగ్గర చెప్పుకుని బాధపడ్డాడు. తన భార్య చంద్రునికి ప్రియురాలైపోయిన వైనం వివరించి దేవగురువు బృహస్పతి పడే బాధ చూసిన ఇంద్రునికి కూడ ఒళ్ళు మండి, చంద్రుని వద్దకు ఒక దూతను రాయబారం పంపించాడు. దౌత్యం విఫలమై దేవతలకు, చంద్రునికి యుద్ధం సంఘటిల్లింది. ఒక స్త్రీ కారణంగా దేవతల్లోనే చీలిక లొచ్చి యుద్ధం ప్రారంభమైపోయింది.

ఇద్దరు సోదరులు జగడమాడుకున్నా, అందులో అవినీతిపరుడు ఎటువైపుంటాడో అటువైపు దుష్టులు చేరి సహాయం చేస్తారన్న లోకరీతి చంద్రుని పట్ల నిజమైంది. దేవగురువు పట్ల తనకున్న ద్వేషాన్ని పురస్కరించుకుని రాక్షసగురువు శుక్రాచార్యుడు చంద్రుని దగ్గరకెళ్ళి, తన మద్దతు ప్రకటించాడు. యుద్ధంలో మంత్రశక్తి ఉపయోగించి అయిన సరే - 'నీ ఎదుటిపక్షంతో పోరు సల్పడానికి నేను బాసటగా ఉంటానన్నాడు రాక్షసగురువు. అది శివునకు ఆగ్రహం తెప్పించింది.

దేవతల మధ్య రాజుకున్న అగ్ని దేవదానవ సంగ్రామంగా పరిణమించింది. సంవత్సరాల తరబడి కొనసాగింది.

బ్రహ్మదేవుడికి ఈ పరిస్థితి గొప్ప సంకట స్థితి అయింది. ఇరుపక్షాల్లోను శాంతి నెలకొల్పడం అనివార్యమైంది. హంసవానారూఢుడై ఆకాశ మార్గాన పోరు జరుగుతున్న చోటుకు వచ్చి నిలిచాడు.

"పొరపాటు చేసి, పైగా కుట్రదారులను పోగేసి పితూరీలేవదీస్తావా చంద్రా! ఇది చాలా అన్యాయం. గురుపత్నిని ఆయనకు అప్పగించు! శుక్రాచార్యా! అందరికీ బుద్ధి చెప్పవలసినవాడివి. నువ్వే ఇలా ప్రవర్తించడం తగునా? మీ సంగ్రామం వల్ల జగత్తుకు విపత్తు ఏర్పడుతున్నదన్న కనీస జ్ఞానంతోనైనా, ఈ పోరు విరమించాల్సిందే! చంద్రా! నీ తండ్రి అత్రి మాటపై నీకేమాత్రం గౌరవం ఉన్నా, తారను ఆచార్యుల వారి సన్నిధికి చేర్చు! ఆయన అభిప్రాయం నాకు చేరింది. కనుకనే హుటాహుటిగా ఇక్కడికొచ్చాను" అని గద్దించి, "శుక్రాచార్యా! అగ్నికి ఆజ్యంపోసినట్లు యుద్ధానికి బాసటగా నిల్చావు, ఇప్పుడీ శాంతికీ నీ చేతనైనది చెయ్యి" అని పెద్దరికం ఉట్టి పడేళా చెప్పాడు పితామహుడు.

పరమేష్ఠి గద్దింపు ధోరణిలో సత్యం ఉందన్న సంగతి తెలుసు కనుక, చంద్రుడి దగ్గరకెళ్లి - బృహస్పతికి తారను అప్పగించేయమన్నాడు. కాని అప్పటికే తార గర్భవతిగా ఉంది. అదే స్థితిలో ఆమెను గురువుగారికి అప్పగించేశాడు చంద్రుడు. బృహస్పతి తారను చేకొని తననివాసానికి వెళ్లాడు.

బుధ జననం:

యుద్ధం ముగిసింది. అందరూ ఎక్కడి వాళ్లక్కడ సర్దుకున్నారు. నవమాసాలూ మోసి, తార పండంటి బిడ్డడ్ని కన్నది. బృహస్పతి ఆ పిల్లవానికి యధావిధిగా జాతకర్మలు జరిపించాడు.

పుత్రుడు జన్మించాడని తెలిసిన చంద్రుడు సంబరపడి, ఆ వెంటనే - జాతకర్మలు బృహస్పతి జరిపించడం పట్ల మండిపడ్డాడు. శాస్త్రరీత్యా ఆ శిశువునకు తాను జనకుడు గనుక, తానే చేయాల్సుంటుందన్నాడు". కాదు - కాదు, ఆ శిశువు నా కొడుకే" అంటాడు బృహస్పతి.

వివాదం ముదిరింది. మళ్లీ పెద్ద రగడ అయ్యే సూచనలు కనపడేసరికి, ముందుగానే దాన్ని వారించదలచి బ్రహ్మ మరోసారి పెద్దరికం వహించాల్సి వచ్చింది. "ఏ శిశువుకు ఎవరు తండ్రి అనేది నిర్ణయించగలది, సృష్టిలో ఒక్క తల్లి మాత్రమే! బిడ్డ పుట్టాక - అదుగో నాయనా! ఆయన మీ పితృదేవుడు అంటు తల్లి వ్రేలెత్తి ఎవర్ని చూపిస్తే ఆ బిడ్డ అతన్నే తండ్రిగా పిలవడం అనాదిగా లోకరీతి. కనుక - ఈ వివాదం తగదు. తారను రప్పించి అడిగితేసరి!" అన్నాడు బ్రహ్మ. అప్పుడా దేవతల సమక్షంలో కొచ్చిన తార, అతడు ముమ్మాటికీ చంద్రవంశాంకురమేనని వచించేసరికి బృహస్పతి ఆశ్చర్యపోయాడు.

మహదానందంగా చంద్రుడా బాలుని వెంటనిడుకుని, తన నిజ నివాసానికి వెళ్లి 'బుధుడు' అని నామకరణం జరిపించాడు.

శ్రీ అన్నపూర్ణ దేవి

శరన్నవరాత్రి ఉత్సవాలలో దుర్గమ్మ అన్నపూర్ణ దేవిగా దర్శనమిస్తుంది.
సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం.
ఈ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది.
ఆదిభిక్షువైన ఈశ్వరుడికి భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణ దేవి.
ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి, మధుర భాషణం, సమయస్పూర్తి కలుగుతాయి.
 

Photo: శ్రీ అన్నపూర్ణ దేవి
శరన్నవరాత్రి ఉత్సవాలలో దుర్గమ్మ అన్నపూర్ణ దేవిగా దర్శనమిస్తుంది.
సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం.
ఈ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది.
ఆదిభిక్షువైన ఈశ్వరుడికి భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణ దేవి.
ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి, మధుర భాషణం, సమయస్పూర్తి కలుగుతాయి.

Is Lord Hanuman still alive? Forest dwellers say yes

Lord Hanuman is said to have the boon of immortality. He was born in Ramayana period but hundreds of years after that, in Mahabharata period too, He was alive. He came to meet the Pandavas before the war of Mahabharata. After hundreds of years of Mahabharata war, He may be still alive in this digital age too. Signs of His presence are coming this time from a mystery tribe in jungles of Sri Lanka. 

This mystery tribe can well be a small sub-tribe of Veddah who are indigenous people of Sri Lanka. A spiritual organization called Setu Asia is studying this tribe and has come up with some startling revelations. People of this tribe are highly spiritual and completely disconnected from the modern world. They live in their own world of jungle with monkeys and birds. Their history goes back to the Ramayana period. According to Setu Asia, after Lord Rama's death Lord Hanuman roamed in various places of the planet. At that time He visited the kingdom of Vibhishana in Lanka too. He lived with ancestors of this tribe and gave them the knowledge of supreme. Study reveals that Lord Hanuman comes to meet these people every 41 years and He came to meet them recently this year. Next arrival may happen around year 2055.
Interestingly the people of this tribe celebrate the arrival of Lord Hanuman every 41 years and the head of the tribe notes down every minute of Lord Hanuman’s visit in a kind of “Log Book”. Lord Hanuman’s recent visit to this tribe which concluded on 27th May 2014 according to western calendar is also documented by the tribe in their Log Book. Setu Asia is now trying to understand it to know more about the conversations which took place between Lord Hanuman and the tribal people. Only one chapter of this log book has been decoded so far. The first chapter reveals how Lord Hanuman was seen on a mountain in Nuwera Eliya by the tribesmen.
For convenience of devotees across the world, Setu Asia is posting English translations of this Log Book on their website www.setu.asia . First chapter has already been posted and more will follow. 

Hindu scholars from India are interpreting it in various ways. Swami Rajmohan, a scholar from Varanasi says, “Lord Hanuman is immortal. Hence it is not a miracle that He was seen in the jungle. He is always there but we mortals of Kaliyuga are not pure enough to see Him from our physical eyes.” 

Bodisathya Chakraborthy, a blogger who blogs on Hinduism writes, “This could be beginning of end of Kaliyuga. Nothing can be revealed to us unless Lord Hanuman Himself wants it to be revealed. If He has revealed about His presence to the mortals of digital world, this must be the right time of end of Kaliyuga.” 

We human beings of digital age may be very advanced in many things but when it comes to the spiritual advancement, these forest dwellers are way ahead of us. While we may see everything with the prism of our self-defined rationality, there are divine things which exist well beyond our small world of "job, home and vacations".

దేవుడికోసం నైవేద్యం

గోవధ మహాపాపం. తెలియక చేస్తారు. మహాపాపాన్ని సంపాదించుకుంటారు. గోవధ చాలా భయంకరం. అది జరిగే చోట కూడా వేదప్రామాణ్యం తెలిసిన వాడు ఉండకూడదు. శ్రీ జగద్గురువులు శృంగేరీ భారతీ తీర్థ స్వామీజీ కొన్ని సంవత్సరాలు హైదారాబాదుకు రాలేదు. ఈ గోవధ జరగడం గురించి వినలేక ఉన్నానని. మహానుభావులు ఆ ప్రాంతం వైపుకు కూడా రారు. అది అప్రశస్తం. అది మన హిందూ భారతీయ సనాతన సంప్రదాయానికి పూర్తి విరుద్ధం.
జంతుబలి ఆపడం మంచిదే. జీవహింస మంచిది కాదు. సనాతనంగా జరుగుతూనే ఉన్నది. వేటాడడం కోసం రాజులు వెళ్ళినట్లు యే కథలో చూసినా ఉంటుంది. ఇప్పటికీ జమీందారీ కుటుంబాలలో వేటకోసం తుపాకులు ఉంటూంటాయి. దేవతా పూజకోసం చంపకూడదు. ఒక సూత్రం ఉన్నది. “యదన్నః పురుషోభవతి తదన్నాస్తస్య దేవతాః” – నువ్వు యేది తింటూ ఉంటావో అది దేవతకు పెట్టాలి. నువ్వు పులిహోర, దద్ద్యోజనం తింటూ ఆమెకి చారు మెతుకులు పెట్టకూడదు. ఆ దృష్టితో సప్తశతి మొదలైన వాటిలో గానీ, దేవీ ఉపాసనా క్రమంలోగానీ, జంతువులు బలులు సనాతనంగా ఉన్నాయి. అయితే కేవలం ఆమెయొక్క ఆరాధనకోసం వాడి దానిని వినియోగించుకుంటారు. అది తినేవాళ్ళు అలా ఆరాధిస్తారు. అలా పనికి వస్తుంది కానీ వాళ్ళు తినకపోతే అమ్మవారికి అవి పెట్టక్కరలేదు. అమ్మవారి బలి దగ్గర జంతుబలి అన్నారు కానీ మార్కెట్లో వచ్చే టన్నులకొద్దీ గంపలు ఎలా వస్తున్నది? అదెవరూ నిషేధించడంలేదు. అక్కడే ఉంది తమాషా. శాస్త్రీయంగా చెప్పబడ్డ చోట బలిగా చేసేది వాళ్ళ సంప్రదాయంలో ఉన్నది; వాళ్ళు తినేటటువంటిది; అయిన దానిని జంతుబలి చేయడం ఉన్నది వెనకటి నుంచి. అది అనేక శాస్త్రాలలో ఉన్నది, ఉపాసనా కాండలలో ఉన్నది. అమ్మవారి కోసం జీవహింస చేయకూడదు. మనం తినకూడనిది, పెట్టకూడదు. హాయిగా గారెలు, పులిహోర, దద్ద్యోజనం వంటివి, యే అన్నం నువ్వు తింటున్నావో అది దేవుడికి పెట్టడం న్యాయం. అంతేగానీ దేవుడికోసం నైవేద్యం వేరుగా, మనం తినేది వేరుగా చేయకూడదు.

పూజ మందిరం లో శివలింగం పెట్టి పూజించ వచ్చా



ఈశ్వరునికి ప్రతీక ఈ లింగం. భూమికి ప్రతీక ఈ లింగం. మనలో ఉండే ప్రాణశక్తికి ప్రతీక ఈ లింగం. అయితే అందరూ పూజామందిరంలో పెట్టుకొని అర్చించవచ్చునా అంటే కొంచెం ఆలోచించవలసిన అంశమే. ఎవరైనా ఆఫీసర్ ఇంటికి వస్తే ఎంతో మర్యాదలు చేస్తాం. అలాంటిది దేవదేవుడే ఇంటికి వస్తే ఎంత జాగ్రత్తగా ఉండాలి? శివలింగం పెట్టుకున్నాం అంటే సాక్షాత్తు శివుడే ఇంట్లో ఉన్నాడు అన్నటువంటి జ్ఞానం కలిగి ఉండాలి కదా! అంటే దేహంలో ఆత్మలో పరమేశ్వరుడున్నాడు అన్న యెరుక గలవాళ్ళు యోగులు. చాలా పవిత్ర భావనలతో జీవించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ఆహారపు అలవాట్లనుంచి మొదలుపెట్టుకుంటే వ్యవహారం, నడవడిక సర్వమూ కూడా ప్రతీకాత్మకంగా, ఆదర్శప్రాయంగా ఉంటుంది. అలా కాకుండా వ్యవహారం వ్యవహారమే దేవుడు దేవుడే అంటే ఎలాగ?
ఇంట్లో శివలింగం పెట్టుకోవాలి అంటే అనేక నియమాలు పాటించాలి. ఈనాటి కాలంలో మాసిక నియమంలో ఉండేటటువంటి స్త్రీలు స్వేచ్ఛగా ఇంట్లో తిరుగుతూ ఉంటారు. ఋతుకాల సంబంధిత నియమాదులు అంతగా పాటింపబడడం కాస్త తక్కువైన కాలం ఇది. అలాగే అర్చన సమయంలో కూడా కాలనియమాన్ని అనుసరించి సంపూర్ణ కాలం కేటాయించగలుగుతున్నామా? నైవేద్యాదులు పాటించగలుగుతున్నామా? పరీక్షలు వ్రాయాలంటే అటెండెన్స్ ఉండాలి, ఫీజ్ కట్టాలి అనే కాలంలో ఉపనయనం చేసుకుంటే గానీ వేదాధ్యయనం ఎందుకు అని ప్రశ్నించే ఈరోజులలో శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవాలి అంటే మన ఇంటికి 230వాల్టుల కరెంటు ఉంటే చాలు. శివలింగం అంటే వీధిలో ఉండే జంక్షన్ అనే చెప్పుకోవాలి. జంక్షన్ లో పెట్టే లైట్ ను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నామంటే ఎంత వెలుతురు? ఎంత నియమం? ఇవన్నీ పాటించాలి కనుక లింగం ఇంట్లో పెట్టుకోవచ్చును కానీ అమితమైన అనంతమైన నియమాలను పాటించవలసి ఉంటుంది. మనకి పటం చాలు, ఆలయం చాలు అర్చకులు చాలు కాదండీ అంటే నియమాలన్నీ తెలుసుకొని పాటించాలి.

కాలబైరవుడు ఈశ్వరుడు ఒక్కరేనా

పరమశివుడే వీరభద్రునిగా, కాలభైరవునిగా అనేక రూపములతో ఆరాధింపబడతాడు. దక్షయజ్ఞం విధ్వంసం మొదలైన వాటికి వీరభద్రుడుగా వచ్చాడు. కాలభైరవుడిగా కాశీలో యమధర్మస్థానం కాలభైరవుడు. పంచక్రోశరూపమైన కాశీలో కేదారఖండం పడింది. మహాపుణ్యభూమి. ఈ ఐదుక్రోసుల కాశీలో యమధర్మరాజుకానీ, ఆయన establishment కానీ రాకూడదు. వాళ్ళకు ఆ హక్కు లేదు. యముడు border చుట్టూ తిరుగుతాడు కానీ లోపలికి రాడు. ఇక్కడ హక్కంతా కాలభైరవుడిదే. అందుకే కాలభైరవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దండంతో బాదతారు వీపుమీద. నీకు రక్షణ ఇచ్చినట్లు కాలభైరవుడు. కాలభైరవుడు శివస్వరూపం. ఆయనకు ప్రత్యామ్నాయంగా మనం సర్వభూతములయందు పరమాత్మను చూస్తాం. అదీ గొప్పతనం. మన సంప్రదాయంలో అన్ని భూతములలో భగవంతుడున్నాడు. విష్ణుమూర్తి వరాహంగా కనపడ్డాడు. శంకరుడు కాలభైరవరూపంలో శునకంగా కనపడతాడు. సుబ్రహ్మణ్యస్వామి సర్పరూపంగా కనపడతాడు. అటువంటి కాలభైరవుడు కాశీ క్షేత్రానికి అధిపతి. శివస్వరూపమే ఇంకోరూపంగా కాలభైరవుడిగా ఉన్నాడు. ఢిల్లీలో పురాన్ ఖిల్లా వెనక గోడకి దగ్గరగా కాలభైరవుడు ఉన్నాడు. ఆ కాలభైరవుని భీముడు తీసుకువచ్చాడు. రాజసూయయాగం పాండవులు చేసేటప్పుడు నిర్విఘ్నంగా జరగాలంటే ఏమిటి ఉపాయం? అంటే కాలభైరవుని ఆశ్రయించు. విఘ్నాలు రావు అన్నారు. ఆయనను సేవిస్తే నేను వస్తున్నా పో అన్నారు. మనప్రాంతంలో తెలంగాణాలో నిజామాబాద్ దగ్గర కాలభైరవక్షేత్రం ఉన్నది. చాలామంది భక్తులు వెళతారు కనుక ఎక్కడ ఉన్న కాలభైరవుడైనా కాలభైరవుడే, మూలస్థానం కాశీలో

గృహప్రవేశం లో కట్టే గుమ్మడి కాయని కుళ్ళి పోయినా ఎండి పోయిన మార్చి కట్టాలా


బ్రహ్మచారిని దేవి




శరన్నవరాత్రి పూజను ఉదయం చెయ్యాలా లేక సాయంత్రం చెయ్యాలా


దశావతారములు

యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్
పరిత్రాణాయ సాధూనామ్ వినాశాయ చ దుష్కృతామ్
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే
అర్జునా! ధర్మమునకు హాని కలిగినప్పుడును, ఆధర్మము పెచ్చుపెరిగిపోవుచున్నప్పుడును (జన్మ కర్మ రహితుడనైనప్పటికిని) నన్ను నేను సృజించుకొందును. సత్పురుషులను పరిరక్షించుటకును, దుష్టులను రూపు మాపుటకును, ధర్మమును సుస్థిరమొనర్చుటకును నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును.
భగవద్గీత నాల్గవ అధ్యాయము - జ్ఙాన, కర్మ సన్యాస యోగముల లోని ఈ రెండు శ్లోకములు ప్రసిద్ధములు. హిందూ విశ్వాసముల ప్రకారము లోకపాలకుడైన శ్రీ మహా విష్ణువు అనేక అవతారములు దాల్చును. అందు కొన్ని అంశావతారములు (ఉదా: వ్యాసుడు). కొన్ని పూర్ణావతారములు (ఉదా: నరసింహుడు). కొన్ని అర్చావతారములు (ఉదా: తిరుపతి వేంకటేశ్వరుడు).
పూర్ణావతారములలో దశావతారములు ముఖ్యమైనవి. అవి:
1. మత్స్యావతారము
2. కూర్మావతారము
3. వరాహావతారము
4. నృసింహావతారము లేదా నరసింహావతారము
5. వామనావతారము
6. పరశురామావతారము
7. రామావతారము
8. కృష్ణావతారము
9. బుద్ధావతారము
10. కల్క్యావతారము
చాలాకాలము నుండి విష్ణువు అవతారాలలో పది ముఖ్యమైనవి అని చెప్పుచున్నప్పటికీ. ఆ పది అవతారాలు ఏవి అన్న అంశంపై ఏకాభిప్రాయం లేదు. హరివంశమునందు నారాయణ, విష్ణు, వరాహ, నారసింహ, వామన, దత్తాత్రేయ, జామదగ్న్య, రామ, కృష్ణ, కల్కి అవతారములు పది ప్రధానావతారాలని పేర్కొనబడింది (హరి వంశం పూర్వ 1.42). ఇందులో మత్స్య, కూర్మ, బుద్ధ, బలరామావతారాలు లేవు. మహాభారతమునందు శాంతిపర్వములో చెప్పబడిన అవతారములలో బుద్ధావతారం లేదు (శాంతి పర్వం అ.339). మత్స్య పురాణంలో ధర్మ, నరసింహ, వామనావతారములు సంభూత్యవతారములని, దత్తాత్రేయ, మాంధాతృ, పరశురామ, రామ, వేదవ్యాస, బుద్ధ, కల్కి అవతారాలు మానుషావతారములని దశావతారాలను ఏకరువు పెట్టినది.
====================================================================
శ్రీహరి దశావతారములు
పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు.
1. మత్స్యావతారము :
వైవస్వతమను అనే సూర్యుని పుత్రుడు సత్యవ్రతుడు. అతనికి శ్రాద్ధదేవుడు అనే పేరు కూడ గలదు. ఆ సత్యవ్రతుడు కృతమాలిక అనే నదిలో అర్ఘ్యం ఇస్తున్నాడు.
ఆయన దోసిలిలోకి ఒకచిన్న చేపపిల్ల వచ్చింది. దాన్ని ఆయన నదీజలంలో పడవేయబోతే, ‘ఓ రాజర్షీ! నీవు దయాత్ముడివి… నన్ను మింగేసే పెద్దచేపలు నదిలో ఉన్నాయని తప్పించుకోవడానికి నేను నీ చేతిలోకి వచ్చాను’ అంది. దానితో ఆ రుషి తన కమండలంలోని నీటిలో చేపపిల్లను ఉంచి తన ఆశ్రమానికి తీసుకువెళ్లాడు. తరవాత ఆ చేపకు కమండలం సరిపడక నూతిలో వేయగా అదీ సరిపోలేదు. పరిణామం క్రమక్రమంగా పెరిగిన ఆ చేపకు సరోవరంగానీ నదిగానీ సరిపోక సముద్రంలో వేయగా, సముద్రంలోనూ లక్షల యోజనాలను ఆక్రమించింది. అప్పుడు రాజు “నీవెవరవు?” అని ఆ చేపను ప్రార్ధించగా ఆ చేప తాను మత్స్యాకృతి దాల్చిన విష్ణువునని చెప్పింది. “శ్రీ లలనాకుచవీధీ కేళీ పరతంత్రబుద్ధిన్ క్రీడించు శ్రీహరీ! తామసాకృతిన్ ఏలా మత్స్యంబవైతివి?” అని రాజు ప్రశ్నించాడు.
అప్పుడా మత్స్యం ఇలా జవాబిచ్చింది. “రాజా! నేటికి 7వ దినమునకు బ్రహ్మదేవునకు ఒక పగలు పూర్తియై రాత్రి కావస్తున్నది. అప్పుడు సకల ప్రపంచమూ జలమయమౌతుంది. నా మహిమ వల్ల ఆ ప్రళయసాగరంలో ఒక నావ వస్తుంది. ఆ నావలో నిన్నూ, తపోమూర్తులైన మునులనూ, ఓషధులను, తిరిగి సృష్టికోసం అవుసరమైన మూలబీజాలనూ పదిలం చేసి నా శృంగము (ఒంటి కొమ్ము) తో ఆ నావను లాగి ప్రళయాంబోధిని దాటింతును” అని చెప్పెను.
ప్రళయం సంభవించి, ధరిత్రి మొత్తం సముద్రంలో మునిగిపోయినప్పుడు, లీలామానుష వేషధారి అయిన ఆ శ్రీమన్నారాయణుడు ధగధగమని కాంతులీనే సువర్ణ వర్ణంగల పెద్దచేపగా అవతరించి, మనువుకు ఒక దేవనౌకను అనుగ్రహించాడు. స్వామి ఆదేశానుసారం మనువు ఆ నౌకలో సమస్త ఔషధులను, బీజాలను నింపడమే కాక- సప్త రుషులను అందులోనికి పంపి, వాసుకిని తాడుగా ఉపయోగించి, దివ్యకాంతులతో వెలిగిపోతున్న మత్స్యానికి ఉన్న కొమ్ముకు నౌకను కట్టాడు. ఆ రకంగా ప్రళయాన్ని దాటుతున్న సమయంలో నౌకలోని వారందరూ ఆయన నామామృతంతో తరించారని పురాణాలు విశదీకరిస్తున్నాయి.
సృష్టి కార్యంలో అలసిన బ్రహ్మ ఆ కల్పాంత సాయంసంధ్యలో రవ్వంత కునుకు తీసెను. ఇదే అదనుగా చూసుకొని హయగ్రీవుడనే రాక్షసుడు బ్రహ్మ దగ్గరనుండి వేదాలను చేజిక్కించుకొని మహాసముద్రంలోకి ఉరుకెత్తాడు. శ్రీమన్నారాయణుడు మత్స్యరూపంలో ఆ రాక్షసుని వెదకి, చంపి, వేదములను తిరిగితెచ్చి బ్రహ్మకిచ్చాడు.
2.కూర్మావతారము:
దేవదానవులు అమృతము కోసము పాలసముద్రాన్ని మథించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా నిర్ణయించి, పాలసముద్రంలో వేస్తే అది కాస్తా ఆ బరువుకి పాలసముద్రంలో మునిగిపోతుంటే, విష్ణుమూర్తి కూర్మావతారములో దానిని భరిస్తాడు. ఇది కృతయుగం లో సంభవించిన అవతారం.
ఒకమారు దేవేంద్రుని ప్రవర్తనకు కోపించిన దూర్వాస మహర్షి “దేవతలు శక్తిహీనులగుదురు” అని శపించాడు. అందువలన దానవులచేతిలో దేవతలు పరాజయం పొందసాగారు. వారు విష్ణువుతో మొరపెట్టుకోగా “సకల ఔషధులకు నిలయమైన పాలకడలిని చిలికి అమృతాన్ని సాధించండి” అని విష్ణువు ఉపాయాన్ని ఉపదేశించాడు.
దేవతలు ఆ బృహత్కార్యం కోసం అందుకు తమకంటె శక్తివంతులుగా ఉన్న దానవులతో సంధి కుదుర్చుకొన్నారు. మందర పర్వతం కవ్వంగా, వాసుకి త్రాడుగా క్షీరసముద్ర మథనం మొదలయ్యింది. కాని మందరగిరి బరువుకి మునిగిపోసాగింది. కార్యం నిష్ఫలమయ్యే పరిస్థితి ఉత్పన్నమైంది.
అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారమును ధరించి పర్వతము క్రింద ఆధారముగా నిలువబడి ఆ కొండను భరించెను. దానితో సముద్ర మధనము జరిగి సర్వ వస్తువులును, అమృతమును పుట్టెను.
అలా దేవదేవుని అండతో సముద్రమథన కార్యం కొనసాగింది. ముందుగా జగములను నాశనము చేయగల హాలాహలము ఉద్భవించినది. దేవతల మొర విని, కరుణించి, పరమశివుడు హాలాహలాన్ని భక్షించి, తన కంఠంలోనే నిలిపాడు. అందుచేత ఆయనను గరళకంఠుడు అనీ, నీలకంఠుడు అనీ అంటారు. తరువాత సుర (మధువు), ఆపై అప్సరసలు, కౌస్తుభము, ఉచ్ఛైశ్రవము, కల్పవృక్షము, కామధేనువు, ఐరావతము వచ్చాయి. ఆ తరువాత త్రిజన్మోహినియైన శ్రీలక్ష్మీదేవి ఉద్భవించింది. సకలదేవతలు ఆమెను అర్చించి, కీర్తించి, కానుకలు సమర్పించుకొన్నారు. ఆమె శ్రీమహావిష్ణువును వరించింది. చివరకు ధన్వంతరి అమృత కలశాన్ని చేతబట్టుకొని బయటకు వచ్చాడు. తరువాత విష్ణువే మోహినిగా ఆ అమృతం దేవతలకు దక్కేలా చేశాడు.
జయ విజయులు:
జయ విజయులు వైకుంఠంలో ద్వారపాలకులు. విష్ణుసేవా తత్పరులు. ఒకమారు సనకసనందనాది మునులు నారాయణ దర్శనార్ధమై వైకుంఠమునకు రాగా అది తగు సమయము కాదని ద్వారపాలకులు వారిని అడ్డగించారు. అందుకు మునులు కోపించి, విష్ణులోకానికి దూరమయ్యెదరని శపించారు. అప్పుడు వారు శ్రీ మహా విష్ణుఫును శరణు వేడగా, మహర్షుల శాపమునకు తిరుగులేదు. కానీ మీరు నా భక్తులైనందువలన మీకు కొంత శాప విమోచన కలిగిస్తాను. మీరు నా భక్తులుగా 7 జన్మలు గానీ, విరోధులుగా 3 జన్మలుగానీ భూలోకమున జన్మించిన పిమ్మట మరల వైకుంఠానికి వస్తారని ఉపశమనాన్నిచ్చారు. అప్పుడు వారు మీకు దూరంగా 7 జన్మలు ఉండలేమని, విరోధులుగా 3 జన్మలు ఎత్తుతామని పలికెను.
ఆ జయవిజయులే కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగాను, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగాను, ద్వాపరయుగంలో శిశుపాల దంతవక్తృలుగాను జన్మించారు. ప్రతి జన్మలోను విష్ణువు అవతారంచేత వధులై అనంతరం శాపవిముక్తి పొందారు.
౩.వరాహావతారము:
శ్రీ మహావిష్ణువు జలప్రళయంలో మునిగిపోయిన భూమిని ఉధ్ధరించటానికి వరాహరూపాన్ని దాల్చాడు.
మహాప్రళయం సంభవించింది. భూమి జలంలో మునిగిపోయింది. బ్రహ్మ చింతాక్రాంతుడై నిఖిల జగత్తును కల్పనచేశాను. స్వాయంభువ మనువు నివసించేందుకు ఆధారభూతమైన భూమి ఇప్పుడు లేకుండా పోయిందే అని భావిస్తూ, సర్వభూతాంతరాత్ముడైన పుండరీకాక్షుని స్మరించసాగాడు. ధ్యాన నిమగ్నుడైన బ్రహ్మ నాసిక (ముక్కు) నుంచి, బొటనవేలు పరిమాణమున్న వరాహంగా శ్రీహరి విశ్వంభరోద్ధారణకై జన్మించాడు.
అప్పుడు యజ్ఞవరాహమూర్తిని బ్రహ్మ స్తుతించెను. “దేవా… సనకసనందనాదుల శాప వశమున జయ విజయులు దితి గర్భాన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులై జన్మించి ఉన్నారు. హిరాణ్యాక్షుడు నేడు అఖిలలోక కంటకుడై, భూమిని తీసుకొని నీకై వెదకుచూ రసాతలమునకు పోయాడు…. అని బ్రహ్మ వివరించాడు.
ఆ పలుకులు విని యజ్ఞవరాహమూర్తి యను సర్వేశ్వరుడు, సముద్ర జలమును చీల్చి రసాతలమును ప్రవేశించి భూమిని సమీపించెను. ఆ జల మధ్యంలో సూకరాకారుడైన హరికి హిరణ్యాక్షుడు ఎదురయ్యాడు. అప్పుడు రాక్షస రాజు గుండెలు తల్లడిల్లునట్లు రణోత్సామున రంకెలు వేస్తూ ఆ వరాహమూర్తి రణానికి సిద్ధమయ్యారు.
రణ రంగంలో హిరణ్యాక్షుని గద, శూలము శ్రీహరి ధీరత్వం ఎదుట వృథా అయ్యాయి. దాంతో హిరాణ్యాక్షుడు రోషోద్ధరుడై మాయా యుద్ధము ప్రారంభించాడు. భీకర పాషాణ పురీష మూత్ర ఘన దుర్గాంధ అస్థి రక్తములు కురియునట్లు మాయా చక్రమును భూచక్రముపై ప్రయోగించాడు. శ్రీహరి తన చక్రముతో మాయా చక్రాన్ని అడ్డగించారు. తన మాయలన్నియు కృతఘ్నునికి చేసిన ఉపకారమువలె పనిచేయకపోవుట గమనించిన హిరణ్యాక్షుడు వరాహమూర్తిపై లంఘించి తన బాహువులను చాచి, హరివక్షంపై బలం కొద్దీ పొడువగా, హరి తప్పించుకుని ఎదురు ముష్టి ఘాతం ఇచ్చాడు. ఆ దెబ్బకు దిర్దిరం దిరిగి, దిట చెడి, లోబడిన హిరణ్యాక్షుని కర్ణమూలమందు తన కోరలతో వరాహమూర్తి మొత్తెను.
అంతట లీలవోలె శ్రీయజ్ఞ వరాహమూర్తి భూమిని తన కోరలపై నుంచి సముద్రము పైన దించి, నిలిపి, విశ్రాంతి వహింపజేసి తిరోహితుడయ్యాడు.
4.నృశింహావాతారము :
దశభుజ పంచముఖ నరసిమ్హుడు
సోదరుని హిరణ్యాక్ష మరణానికి చింతిస్తూనే హిరణ్యకశిపుడు తల్లిదండ్రులను, బంధువులను ఓదార్చాడు. అనంతరం రాజ్యపాలనాభారాన్ని మంత్రులకు అప్పగించి తాను మందరగిరికి పోయి ఘోరమైన తపసు ఆచరించాడు. అతని తపస్సు ఉగ్రతకు లోకాలు కంపించాయి. అతని శరీరం కేవలం ఎముకల గూడయ్యింది. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై తన కమండల జల ప్రోక్షణతో అతని శరీరాన్ని నవయౌవనంగా, వజ్ర సదృశంగా చేశాడు. వరం కోరుకొమ్మన్నాడు. హిరణ్యకశిపుడు విధాతకు మ్రొక్కి, తనకు గాలిలోగాని, ఆకాశంలోగాని, భూమిపైగాని, నీటిలోగాని, అగ్నిలోగాని, రాత్రి గాని, పగలు గాని,దేవదానవమనుష్యులచేగాని, జంతువులచేగాని, ఆయుధములచేగాని, ఇంటగాని, బయటగాని మరణముండరాదని కోరాడు. అలాగే బ్రహ్మ వరాన్ని అనుగ్రహించాడు.
ఇంక వరగర్వంతో హిరణ్య కశిపుడు విజృంభించాడు. దేవతలను జయించాడు. ఇంద్రసింహాసనాన్ని ఆక్రమించాడు.పంచభూతాలను నిర్బంధించాడు. తపములను భంగ పరచాడు. సాధులను హింసింపసాగాడు. దేవతలు విష్ణువుతో మొరపెట్టుకొనగా విష్ణువు – “కన్నకొడుకునకు ఆపన్నత తలపెట్టిననాడు హిరణ్యకశిపుని పట్టి వధింతును. మీకు భద్రమగును” అని వారికి అభయమిచ్చాడు.
హిరణ్యకశిపుడు తపసు చేసుకొనే కాలంలో దేవతలు అదనుచూసుకొని అతనిరాజ్యంపై దండెత్తి కౄరంగా కొల్లగొట్టారు. గర్భవతియైన రాక్షసరాజు భార్యను ఇంద్రుడు చెరపట్టగా నారదుడు ఇంద్రుని మందలించి, ఆమెను రక్షించి తన ఆశ్రమానికి కొనిపోయాడు. ఆశ్రమంలో నారదుడొనర్చిన భాగవత తత్వబోధను గర్భస్థుడైన ప్రహ్లాదుడు గ్రహించాడు. రాజ్యానికి తిరిగివచ్చిన హిరణ్యకశిపునకు నారదుడు అతని ధర్మపత్ని నప్పగించాడు.
ప్రహ్లాదుడు జన్మతః పరమ భాగవతుడు. లలిత మర్యాదుడు. నిర్వైరుడు. అచ్యుతపద శరణాగతుడు. అడుగడుగున మాధవానుచింతనా సుధా మాధుర్యమున మేను మరచువాడు. సర్వభూతములందు సమభావము గలవాడు. సుగుణములరాశి. అట్టి ప్రహ్లాదునకు విద్య నేర్పమని, తమ రాజప్రవృత్తికి అనుగుణంగా మలచమనీ రాక్షసరాజు తమ కులగురువులైన చండామార్కులకప్పగించాడు.
గురుకులంలో ప్రహ్లాదుడు గురువులపట్ల వినయంతో వారుచెప్పిన విషయాలను చెప్పినట్లు ఆకళించుకొన్నాడు.
ఒకమారు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చేరబిలచి – నీవు ఏమి నేర్చుకున్నావు? నీకు ఏది భద్రము?- అని ప్రశ్నించగా ప్రహ్లాదుడు “సర్వము అతని దివ్యకళామయము అని తలచి విష్ణువు నందు హృదయము లగ్నము చేయట మేలు” అని ఉత్తరమిచ్చాడు. రాక్షసులకు తగని ఈ బుద్ధి నీకెలా పుట్టింది? హరీ, గిరీ అని ఎందుకు ప్రేలుతున్నావు? అని తండ్రి గద్దించాడు. కోపించిన రాక్షస రాజుకు సర్దిచెప్పి, మరల వివిధోపాయాలలో బోధన చేస్తామని ప్రహ్లాదుని గురుకులానికి తీసుకొని వెళ్ళారు గురువులు. అక్కడ మళ్ళీ ప్రహ్లాదునికి తమ విద్యలు నూరిపోసి, రాజువద్దకు తిరిగి తీసికొని వెళ్ళారు. రాజు తన కొడుకును ముద్దుచేసి – “గురువులే సంవిద్యాంశంబులు జెప్పిరో చెప్పు అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు శ్రీహరి భక్తిలేని బ్రతుకు వ్యర్ధము. విష్ణుని సేవించు దేహమే ప్రయోజనకరము. ఆ దేవదేవుని గూర్చి చెప్పేదే సత్యమైన చదువు. మాధవుని గూర్చి చెప్పేవాడే సరైన గురువు. హరిని చేరుమని చెప్పేవాడే ఉత్తముడైన తండ్రి.” అని వివరించాడు.
హిరణ్య కశిపుడు మండి పడ్డాడు. తన శత్రువైన విష్ణువును కీర్తించినందుకు ప్రహ్లాదుని కఠినంగా శిక్షించమని ఆదేశించాడు. కాని శూలాలతో పొడిచినా, ఏనుగులతో తొక్కించినా, మంటల్లో కాల్చినా, కొండలపైనుండి త్రోయించినా ప్రహ్లాదునకు బాద కలుగలేదు. అతడు హరినామ స్మరణ మానలేదు. అదిచూసి రాజు చింతాక్రాంతుడయ్యాడు. మరొక అవకాశం అడిగి రాక్షసగురువు ప్రహ్లాదుని గురుకులానికి తీసికొనివెళ్ళారు. అక్కడ ప్రహ్లాదుడు మిగిలిన రాక్షస బాలురకు ఆత్మజ్ఞానాన్ని, హరితత్వాన్ని, మోక్షమార్గాన్ని ఉపదేశించసాగాడు. ఇలా లాభం లేదని గురువు రాజుతో మొరపెట్టుకున్నాడు.
క్రోధంతో హిరణ్య కశిపుడు ప్రహ్లాదుని పిలిపించి – నేనంటే సకల భూతాలు భయపడతాయి. దిక్పాలకులు నా సేవకులు? ఇక నీకు దిక్కెవరు? బలమెవరు? అని గద్దించాడు. అందరికీ ఎవరు బలమో, అందరికీ ఎవరు దిక్కో ఆ విభుడే నాకు దిక్కన్నాడు ప్రహ్లాదుడు.
ఆ హరి ఎక్కడుంటాడు? అని దానవేశ్వరుడు ప్రశ్నించగా
అప్పుడు ప్రహ్లాదుడు “చక్రి సర్వోపగతుడు. ఎందెందు వెదకి జూచిన నందందే గలడు” అని చెప్పాడు.0ఇలా దైత్యరాజు, అతని సుతుడు వాదించుకొటుండగా శ్రీహరి సకల జడ,చేతన పదార్ధములలో శ్రీ నరసింహాకృతిలో నుండెను. అయితే “ఈ స్తంభమునన్ జూపగలవె చక్రిన్ గిక్రిన్?” అని రాజు ప్రశ్నించాడు. “బ్రహ్మ నుండి గడ్డిపోచవరకు అన్నింటిలో విశ్వాత్ముడైయుండేవాడు ఈ స్తంభమునందెందుకుండడు? స్తంభాంతర్గతుడై ఉండును. ఏ సందేహములేదు. “సరే. చూద్దాం. ఈ స్తంభంలో విష్ణువును చూపకుంటే నీ తలతీయిస్తాను. అప్పుడు హరి వచ్చి అడ్డుపడతాడా?” అని హిరణ్యకశిపుడు చేతితో స్తంభంపై చరిచాడు.బ్రహ్మాండ కటాహం బ్రద్దలయ్యే ఛటఛట ఫటఫటారావములు ధ్వనించాయి. పదిదిక్కుల నిప్పులు చెదిరాయి. “మహాప్రభావుండును నైన శ్రీనృసింహదేవుడు” స్తంభమునుండి ఆవిర్భవించాడు.
ఇది నరమూర్తికాదు, కేవల హరిమూర్తియు కాదు. హరిమాయా రచితమై యున్నదను కొన్నాడు హిరణ్య కశిపుడు. అప్పుడు శ్రీ నృసింహదేవుడు భీకరంగా హిరణ్యకశిపుని ఒడిసిపట్టి తనయొడిలో వేసికొని వజ్రాలవంటి తన నఖాలతో (గోళ్లతో)చీల్చి చెండాడాడు. ఇలా శ్రీహరి (మనిషీ, జంతువూ కాక)నారసింహుని రూపంలో, (పగలూ, రాత్రీ కాని) సంధ్యాకాలంలో, (ప్రాణం ఉన్నవీ లేనివీ అని చెప్పలేని) గోళ్ళతో, (ఇంటా బయటా కాక) గుమ్మంలో, (భూమిపైనా, ఆకాశంలో కాక) తనతొడపైన హిరణ్యకశిపుని సంహరించాడు. బ్రహ్మ వరము వ్యర్ధం కాలేదు. ప్రహ్లాదుని మాట పొల్లు పోలేదు.
స్వామి ముఖం భీకరంగా కనపిస్తోంది. రక్తరంజితమైన వజ్రనఖాలు సంధ్యాకాలపు ఎర్రదనాన్ని సంతరించుకొన్నాయి. ప్రేవులను కంఠమాలికలుగా వేసుకొన్నాడు. జూలునుండి రక్తం కారుతోంది. ఆయన నిట్టూర్పులు పెనుగాలుల్లా ఉన్నాయి. దేవతలు ఆయనపై పుష్పవర్షాన్ని కురిపించారు. సకలదేవతలు స్తుతించి ప్రణతులు అర్పించారు.
మహాభాగవతుడైన ప్రహ్లాదుడు ఉగ్రమూర్తిగా దర్శనమిచ్చిన స్వామికి అంజలి ఘటించి సాష్టాంగ ప్రమాణం చేశాడు. శ్రీనారసింహస్వామి తన అభయ మంగళ దివ్య హస్తాన్ని ప్రహ్లాదుని తలపైనుంచి దీవించాడు. ప్రహ్లాదుడు పరవశించి పలువిధాల స్తుతించాడు. ప్రసన్నుడైన స్వామి ఏమయినా వరాన్ని కోరుకొమ్మన్నాడు.
“స్వామీ! నా తండ్రి చేసిన భాగవతాపరాధాన్ని మన్నించు” అని కోరాడు ప్రహ్లాదుడు. “నాయనా. నిన్ను కొడుకుగా పొందినపుడే నీ తండ్రితో 21 తరాలు (తల్లివైపు 7 తరాలు, తండ్రివైపు 7 తరాలు, ప్రహ్లాదుని తరువాతి 7 తరాలు)పావనమైనాయి. నా స్పర్శతో నీ తండ్రి పునీతుడైనాడు. నీ తండ్రికి ఉత్తర క్రియలు చేసి రాజువుకా. నా యందు మనసు నిలిపి, విజ్ఞుల ఉపదేశాన్ని పొందుతూ పాలన చేయి” అని ఆశీర్వదించాడు స్వామి.
హిరణ్యకశిపుని వధానంతరం భీకర రౌద్రపూరితమైన నృసింహుని బ్రహ్మరుద్రులు, దేవేంద్రాది దేవతలు సైతం శాంతింప చేయలేకపోయారు. చివరకు తన భక్తుడైన ప్రహ్లాదుని చేతనే స్తుతింపబడి శాంతించాడు. శ్రీలక్ష్మీ సమేతుడై స్వామి వైకుంఠమునకరిగెను. బ్రహ్మాది దేవతలు ప్రహ్లాదుని పూజలందుకొని తమలోకములకరిగిరి.
5.వామనావతారం :
బలిచక్రవర్తి అజేయ బలపరాక్రమాలు కలవాడు. మాహాదాత. అతడు దేవతలను జయించి తన వద్ద బందీలుగా ఉంచుకున్నాడు. ఇంద్రాదులు విష్ణుమూర్తిని శరణు వేడుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి బలి తపోఫలము ముగిసిన తరువాత అతనిని జయిస్తానని తెలిపాడు. కొంత కాలానికి అదితి గర్భాన వామనరూపంలో జన్మించాడు. ఒకనాడు బలి మహా యజ్ఞమును చేయసాగాడు. అక్కడు వామనావతారములో ఉన్న శ్రీమహావిష్ణువు వచ్చి మూడు అడుగుల స్థలం ఇవ్వమని అడుగుతాడు. బలిచక్రవర్తి దానికి సరే అనగానే ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగి ఒక అడుగుతో భూమిని, మరొక అడుగుతో స్వర్గాన్ని ఆక్రమించాడు. మూడవ అడుగుకు స్థలం చూపమని అడుగగా, బలిచక్రవర్తిని తన తలమీద వేయాల్సిందింగా కోరతాడు. బలి దానగుణానికి సంతోషించి విష్ణుమూర్తి అతనికి జ్ఞానజ్యోతిని ప్రసాదిస్తాడు. అజ్ఞానం అనే చీకట్లను పారద్రోలి జ్ఞాన దీపాన్ని వెలిగించేందుకు సంవత్సరానికి ఒకసారి బలిచక్రవర్తి భూమి మీదకు వచ్చే వరాన్ని ప్రసాదించాడు.
6.పరశురామావతారం :
శ్రీహరి తన అంశముతో జమదగ్నికి పరశురాముడై పుట్టి మదాంధులైన రాజులను ఇరుబది యొక్క సారులు దండయాత్రలు చేసి సంహరించెను. చివరికి దశరథ రాముని చేతిలో ఓడి తపమునకు బోయెను.
7.శ్రీరామావతారం :
రావణకుంభకర్ణులను సంహరించుటకై దేవతలు ప్రార్ధించిన మీదట దశరధునకు రామునిగా పుట్టి, సీతను పెండ్లాడి, సీతాలక్ష్మనులతో అరణ్యవాసము చేసి అనేక రాక్షసులను వధించెను. రావణుడు సీత నెత్తికొని పోగా సుగ్రీవుని సహాయముతో లంకకు వెళ్లి రావణకుంభకర్ణాది రాక్షసులను సంహరించెను. అయోధ్యకు వచ్చి పట్టము గట్టుకొనెను. లోకాపవాదమునకు భయపడి సీతను అడవిలో వదలగా వాల్మీకి ఆశ్రయమునకు జేరెను. అప్పటికే గర్భవతియైన సీత అక్కడ లవకుశులు అను ఇద్దరు కుమారులను కనెను. రాముడు పదునోక్కవేల యేండ్లు రాజ్యము చేసి కుశునికి పట్టాభిషేకము చేసి, సీత సమేతుడై అయోధ్య పురవాసులతో సహా పరమపదమునకు వేంచేసేను.
8.బలరాముడుగా అలంకరించారు. అనంతరం రామయ్యను కల్యాణ మంటపంలోని ప్రత్యేక వేదిక వద్దకు మంగళవాయిద్యాలు, కోలాట నృత్యాల నడుమ తోడ్కొని వచ్చి ఆశీనులను చేశారు
9.శ్రీకృష్ణావతారం :
ఇరువది యెనిమిదవ ద్వాపరయుగములో అధర్మప్రవ్రుత్తులైన రాజుల వలన భూభారము పెరిగినప్పుడు భూదేవి కోరికపై శ్రీహరి కృష్ణావతారము నెత్తెను. దేవకీవసుదేవులకు అష్టమ గర్భమున జన్మించి, వ్రేపల్లెలో నందయశోదల ఇంట పెరిగి బాల్యక్రీడలచే వారిని అలరించి, దుష్ట రాక్షషులను సంహరించెను. మధురాపురమునకు బోయి కంసుని సంహరించి, మాతామహుని రాజమున నిలిపి, బలరామునితో గలిసి శత్రువులను నిర్మూలించెను. రుక్మిన్యాది అష్టమహిషులను వివాహమాడెను. నరకుని జంపి 16౦౦౦ మందిని వాని చెరనుండి విడిపించెను. ద్వారక నగరమును నిర్మించి భార్యాపుత్రబంధుమిత్ర పరివారముతో నూటపాతిక యేండ్లు భూలోకమున నివసించెను. భారత యుద్దములో పాండవుల పక్షమున నుండి అధర్మాపరులను నాశనము చేసెను. తరువాత యాదవులు మదించి అధర్మముగా ప్రవర్తించుచుండగా ముసులము వంకతో వారిని గూడ సంహరించి తానూ పరమపదమునకు చేరెను.
10.కల్క్యావతారము:
బుద్దుని బోధనల ప్రభావము భూలోకమున రాజులపై ప్రసరించును. వారు అధర్మపరులై ప్రజాకంటకులై ప్రవర్తించురు. ప్రజలు కూడ అన్యాయ ప్రవర్తనులై వేదకర్మల నాచరింపక యుందురు. అప్పుడు కలియుగంలో విష్ణుయశునుడికి శ్రీహరి, కల్కి రూపముతో జన్మించును. ధర్మమును తిరిగి ప్రతిష్టించును.
ఓం నమో పరమాత్మయే నమః